భక్తి కథలు

12 Posts • 3K views
S.HariBlr (Bangalore)
950 views 5 months ago
#😇My Status #భక్తి కథలు #భక్తి కథలు ఆధ్యాత్మిక అమృతవాహిని 🙏 *చతుర్ధశలోకాలలో నివసించేదెవరు.!* *తిహాస, పురాణాలను అనుసరించి, బ్రహ్మదేవున: ఇసృష్టిలో చతుర్దశ(14) భువనాలు లేక లోకాలు కలవు. మనం ఉన్న భూలోకానికి పైన భువర్లోకం, సువర్లోకు, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకాలు, భూలోకంతో చేర్చి సప్త(7) లోకాలు కలవు. అలాగే భూలోకానికి కింద అతలలోకం, వితలలోకం, సుతలలోకం, రసాతలలోకం, తలాతలలోకం, మహాతలలోకం, పాతాళాలని సప్త(7) అధోలోకాలు కలవు.* *భూలోకవాసులైన మానవులను తప్పించి ఇతర లోకాలలో ఉన్నవారు అధిక పుణ్యాత్ములు, అచ్చటనున్న జీవుల శరీరాలు అతిసూక్ష్మములైనవి. భూలోకం దక్షిణదిగ్భాగంలో మృత్యు (యమ) లోకం, ప్రీతలోకం, నరకలోకం, పిత్రులోకాలనే 4* *భూలోకం* *ఇచ్చట స్వేదం(చెమట నుండి ఉద్భవించు పేళ్ళు (పేనులు), వల్లులు మొ II), ఉద్భిజాలు (గ్రుడ్డు నుండి ఉద్భవించు పక్షులు),. జరాయుజాలు (స్త్రీ, పశువుల గర్భం నుండి ఉద్భవించు మానవులు పశువులు) అని నాలుగు* *విధాలైన జీవరాసులు.* *భువర్లోకము(భూలోకము పైన)* *ఇచ్చట సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదులు, అశ్చిన్యాది నక్షత్ర సడ్రుప్యాటైన గ్రహదాసులు, సూక్ష్మ శరీరులైన కిన్నెర కింపురుష, విద్యాధరులు కలరు.* *సువ్వలోకము సువర్లోకము లేక స్వర్గలోకము(భువర్లోకము పైన) ఇక్కడ అధిష్టాన దేవతలు ఆగు ఇంద్రాదులు, దిక్పాలకులు, వర్షవాయువులు, ఐశ్వర్యాదులు కలరు. వీరితోపాటు సాధ్యులు, మహర్షులు, గంధర్వులు, అప్సరసలు కలరు. వీరు కామరూపులై భోగాలను అనుభవంతుడు. వీరికి వుద్యాం, శరీర దుర్గందారులుండవు. వీరిని క్షుతి-సలు బాధింపవు. వీరు అయోనిజులు కావున్న మాత్రుగర్భ వాసం లేదు.* *మహర్లోకము (సువర్లోకము పైన)* *ఇక్కడ దేవతలు తపస్సు చేస్తుంటారు. ఎలా స్వర్గలోకంలోని దేవతలు దివ్య సుఖాలను అనుభవిస్తున్నారో, అవిన్నీ ఇక్కడ తపస్సు ద్వారా పరిపూర్ణంగా అనుభవిస్తుంటారు.* *జనోలోకము (మహర్లోకము పైన)* *దీనిని కొందరు సత్యలోకం అని కూడా అంటారు. ఏ స్త్రీ భర్త మరణానంతరం సహగమనం చేస్తారో, ఆమె పవిత్ర శీలప్రభావంతో ఆమె పతికి అన్య జన్మ ఉన్నప్పటికినీ, జన్మరాహిత్యం కలిగి, సతిపతులిరువు ఈ జనలోకంలో సుఖసాంతులతో వర్ధిల్లుదురు. ఇక్కడ అయోనిజ దేవతలు కూడా తపమాచరిస్తుంటారు.* *తపోలోకము (జనోలోకము పైన)* *ఇక్కడ అయోనిజ దేవతలు నివసిస్తారు. పంచభూతాలు, పంచేంద్రియాలు వీరి అధీనంలో ఉంటాయి. కైలాసం, వైకుంఠం, మణిద్వీపం, స్కందలోకం ఇచ్చటనే కలవు. ఈ లోకం సర్వదా సుగంధ ద్రవ్యాల సువాసనలతో, శాంతియుతంగా, సాంద్రానందంతో కూడి ఉంటుంది. భూలోకంలో ఎవరెవరు. ఏయే దేవతాముర్తులను ఉపాసిస్తారో ఆయా మూర్తుల రూపాలతో ఇక్కడ తపం ఆచరిస్తున్నారు. ఈ రీతిగా వారు కల్పాంతకాలం అక్కడనే ఉండి కర్మానుసారం భూలోకంలో తిరిగి జన్మించి, మరల పవిత్ర తపాలు ఆదరించి, ఎప్పుడు మహాప్రశయంలో సర్వం లయచుగునో అప్పుడు వీరు కూడ జన్మరాహిత్యం పొందుదురు.* *సత్యలోకం(తపోలోకము పైన)* *ఇక్కడ సృష్టికర్త అయిన హిరణ్యగర్భుడు, బ్రహ్మ అను ఒక అధికారిక పురుషుడు ఆ పదవిని అనేకానేక కల్పానంతరం ఒక్కక్కడు పొంది తమ ఆయువు తీరినంతనే బ్రహ్మలలో లయమవుతారు. ప్రస్తుత బ్రహ్మకు మొదటి అర్ధభాగం తీరినది. భావిబ్రహ్మ శ్రీ ఆంజనేయస్వామి. ఈ లోకంలో కూడ అనేక ఉపాసనలు చేసినవారు, వేసొంత విచారకులు, భూలోకంలో ఆత్మజ్ఞానం పొందినవారు. అసంఖ్యాకులగు మహర్షులు వేదాంతవిచారణలు గావస్తుంటారు. మహాప్రళయకాలంలో బ్రహ్మలోక పర్యంతంగా గల సప్తలోకాలు పరబ్రహ్మంలో. బయమవుతారు. బ్రహ్మ తన ప్రతి రాత్రులందు ఒక్కొక్క ప్రళయం సంభవించి, భూలోకం, భువర్లోకం, సువ(స్వర్గ)ర్లోకాలలు లయం అవుతాయి. అతని పగటి కాలంలో పునః ఈ లోకాల సృష్టి జరుగుతుంది.* *సప్త అధోలోకములు:* *భూలోకానికి కింద ఉండేది అతల లోకం, ఇందులో అసురులు నివసిస్తుంటారు. వీరు సూక్ష్మ శరీరులు. భౌతిక సుఖలాలసులు కావున అధిక మద సంపన్నులు,* *వితల లోకం(అతలలోకం కింద) ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల వీర్యం 'ఆధకం' అనే నది సువర్ణ జల ప్రవాహాంతో నిండి ఉండును. అనేర భౌతిక సుఖాలతో పాటు ఈ నదీ ప్రవాహంతో స్వర్ణాభరణాలు చేసుకొని ధరించెదరు.* *సుతల లోకము(వితల లోకం కింద)* *సప్త చిరంజీవులలో ఒకడైన మహాపురుషుడు బలి చక్రవర్తి ఇక్కడే ఉన్నాడు. ఆయన సర్వదా విష్ణుధ్యాన పరాయణుడై శ్రీమహావిష్ణువు ద్వారపాలకుడై కాపలాకాస్తున్నాడు.* *తలాతల లోకం(సుతల లోకం కింద) ఈ లోకంలో పరమేశ్వరునితో సంహరించబడిన దాసవేంద్రులయిన త్రిపురాసురులు, దానవ శిల్పి అయిన మయుడు, మాయావిద్యలో నేర్పరులైన అసురులు, రాక్షసులు నివసిస్తారు. మహాతలము(తలాతలలోకము కింద)* *ఇక్కడ కద్రుపుత్రులైన కాద్రవేయులు(సర్పాలు), సహ్యసాది శిరస్సులతో కూడినవారై బలవంతులై కామరూపధారులై తమ పత్నులతో కూడి ఉన్నారు.* *రసాతలము(మహాతలం కింద) ఇక్కడ అసుర రాక్షస శ్రేష్టులు, నివాత కావదులు, కాలకేయాదులు, సురారులైన అనేక రాక్షసులు కలరు.* *పాతాళము (రసాతలం కింద ఇక్కడ నాగలోకాధిపతియైన వాసుకి మొదలు సర్ప సమూహములన్ని కామరూపధారులై సుఖసంతోషాలతో ఉన్నారు. మహా ప్రళయ కాలంలో ఈ చతుర్దశ భువనాలు పరబ్రహ్మంలో లీనమగును.* ❀꧁శివోహం꧂❀ 🍁🪔🍁 🙏🕉️🙏 🍁🪔🍁
9 likes
5 shares
S.HariBlr (Bangalore)
938 views 5 months ago
#😇My Status #భక్తి కథలు #భక్తి కథలు ఆధ్యాత్మిక అమృతవాహిని 🙏 🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃 *భారం నీదే* ‘ఎన్నిసార్లు నిన్ను పిలవాలి? ఏ రీతి కొలవాలి? అనాథరక్షకుడివని, ఆపద్బాంధవుడివని అంటారే? మరెందుకు నా పిలుపు నిన్ను చేరడం లేదు? నా బాధ నీకెందుకు కనిపించడం లేదు?’... ఇలా మనకు కష్టం వచ్చినప్పుడల్లా దేవుడితో మొరపెట్టుకుంటాం. ఒళ్లంతా కళ్లున్న ఆయనకు మనం కనిపించమనుకోవడం, జగమంత చెవులున్న స్వామికి మన పలుకులు వినిపించలేదనుకోవడం... అవివేకమే! గజేంద్ర మోక్షం ఘట్టంలో మొసలితో పోరు సాగించలేక దీనావస్థలో పడిన గజరాజు, మకరాన్ని గెలవడం తనవల్ల కాదని నిశ్చయించుకుంది. ‘స్వామీ! బలం క్షీణించింది, ధైర్యం సన్నగిల్లింది, ప్రాణాలు అదుపు తప్పుతున్నాయి, స్పృహ కోల్పోతున్నాను. నువ్వు తప్ప దిక్కెవరు లేరు. నన్ను రక్షించే బాధ్యత నీదే!...’ అని సర్వేశ్వరుణ్ని వేడుకుంది. అక్కడెక్కడో వైకుంఠపురంలో లక్షీదేవితో వినోదిస్తున్నాడు శ్రీమన్నారాయణుడు. ‘పాహీ! పాహీ!’ అనే ఆర్తనాదం వినిపించగానే గజేంద్రుడి ప్రాణాలు కాపాడాలనే ఆతృతతో ఆయన లక్ష్మీదేవికి ఏమీ చెప్పలేదు; శంఖచక్రాలను చేతుల్లోకి తీసుకోలేదు, సేవకులనెవరినీ పిలవలేదు, గరుడవాహనాన్నీ సిద్ధపరచుకోలేదు, ప్రణయకలహంలో భాగంగా పట్టుకున్న లక్ష్మీదేవి కొంగైనా వదల్లేదు... ఉన్నపళంగా భువికి బయలుదేరాడు. లక్ష్మీదేవితోపాటు సుదర్శన చక్రం కూడా శ్రీహరిని అనుసరించింది. గజరాజు ఉన్న సరోవరాన్ని చేరుతూనే విష్ణుమూర్తి తన చక్రాన్ని విడిచి పెట్టాడు. ఆ సుదర్శనం విస్ఫులింగాలు చిమ్ముతూ మరుక్షణంలో మొసలి తలను ఖండించింది. అప్పుడు గజేంద్రుడు ఊపిరి పీల్చుకుని కొలను నుంచి బయటికి వచ్చి సంతోషంతో తొండం ఎత్తి హరికి నమస్కరించాడు. కురుసభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు తనను రక్షించేవారి కోసం శోకంతో ఆమె చుట్టూ కలియజూసింది. ఎవరూ ముందుకు రాకపోవడంతో ‘నాకు దిక్కెవరు?’ అనుకున్న సమయంలో కృష్ణుడు ఆమె కళ్ల ముందు సాక్షాత్కరించాడు. వెంటనే ‘ద్వారకావాసా శ్రీకృష్ణా పాహిమాం!’ అని వేడుకుంది. ఆయన కొన్ని ఘడియలు ఆలస్యంగా వచ్చాడు. ‘పిలిచిన వెంటనే పలికే దైవానివి కదా, నా పట్ల ఎందుకు ఆలస్యం చేశావు’ అని ద్రౌపది ప్రశ్నించింది. ‘సోదరీ! నువ్వు ద్వారకావాసా... అని పిలిచావు. అందుకే ద్వారక వెళ్లి మళ్లీ తిరిగి వచ్చేసరికి ఆలస్యమైంది’ అని మనోహరమైన మందహాసంతో జవాబిచ్చాడు నందగోపాలుడు. అప్పుడు ద్రౌపదికి తన పిలుపులోని దూరం అర్థమైంది. భక్తుల ప్రార్థనలకు సులభంగా కరిగిపోయే భక్తవల్లభుడికి కావాల్సింది ఆడంబరంగా చేసే పూజలు కాదు. నిండు మనసుతో ధ్యాస ఆయన మీద కేంద్రీకరించాలి. ‘పాల ముంచినా నీట ముంచినా నీదే భారం స్వామీ!’ అనుకుని మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. మనకు ప్రాప్తమనుకున్నది ఆయన అనుగ్రహిస్తాడు. లేదంటే అంతకన్నా మంచిదేదో మనకోసం వేచి ఉన్నదని గ్రహించాలి. ఆ వాస్తవాన్ని జీర్ణం చేసుకుంటేనే సంతృప్తిగా జీవించగలం! కాదని విధిని దూషిస్తుంటే అసంతృప్తి జ్వాలలకు అజ్ఞాన తిమిరం తోడై దహించుకుపోవాల్సి వస్తుంది. ఆర్తితో అంతరాంతరాల్లో ఆయన్నే స్మరిస్తూ ‘సర్వాంతర్యామీ! నువ్వే దిక్కు!’ అనుకుంటే పరమాత్ముడి కరుణాకటాక్షాలు ఏదోనాడు అమృత జల్లుగా వర్షిస్తాయి! 💦💦💦💦💦💦💦💦💦💦
12 likes
6 shares