#కరెంటు #కరెంటు బిల్లు #🗞️ కరెంటు అఫైర్స్ 📖 #🆕Current అప్డేట్స్📢 #🗞ప్రభుత్వ సమాచారం📻
*పేదల గూడుపై కరెంట్ వాత..*
*'డాబా' పేరుతో 2 కిలోవాట్ల విద్యుత్ లోడ్ బలవంతం..!*
*ప్రభుత్వ సాయంతో ఇల్లు కడితే.. విద్యుత్ శాఖ ముక్కుపిండి వసూళ్లా..?*
*నిరుపేదలపై అదనపు భారం..!*
*✍️..పై ప్రత్యేక కథనం..రిపోర్టర్ :- శేఖర్📲..9603197203..✍️*
ప్రభుత్వ ఆర్థిక సాయంతో ఎంతో కష్టపడి సొంతింటి కల నెరవేర్చుకున్న నిరుపేద గృహ లబ్ధిదారులపై విద్యుత్ శాఖ అధికారులు అదనపు భారం మోపుతున్నారు. నిబంధనల ప్రకారం గృహ వినియోగదారులు తమ అవసరాలను *బట్టి 1 కిలోవాట్ లోడ్తో కొత్త కనెక్షన్ తీసుకునే హక్కు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయి అధికారులు మాత్రం విధిగా 2 కిలోవాట్ల కనెక్షన్ తీసుకోవాలంటూ లబ్ధిదారులను వేధిస్తున్నారు.* ఇల్లు 'డాబా' (పక్కా స్లాబ్ ఇల్లు) అనే ఒకే ఒక్క కారణాన్ని చూపుతూ, బలవంతంగా రూ. 3,500లకు పైగా వసూలు చేస్తుండటంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.
ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖ ద్వారా రుణాలు, సబ్సిడీలు పొంది నిర్మించుకున్న ఇళ్లన్నీ పక్కా స్లాబ్ (డాబా) ఇళ్లే. అయితే కేవలం పైకప్పు కాంక్రీటుతో నిర్మించినంత మాత్రాన ఆ ఇళ్లల్లో విలాసవంతమైన విద్యుత్ పరికరాలు వాడుతున్నట్లు కాదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద కుటుంబాలు ఉండే ఈ ఇళ్లలో కేవలం రెండు బల్బులు, ఒక ఫ్యాన్, మహా అయితే ఒక టీవీ మాత్రమే ఉంటాయి. *వీటికి 500 వాట్లు (0.5) లేదా 1 కిలోవాట్ లోడ్ ఎంతో ఎక్కువ.* అయినప్పటికీ, "స్లాబ్ ఇల్లు ఉంటే 1 కిలోవాట్ ఇవ్వం.. విధిగా 2 కిలోవాట్లకు డబ్బులు కట్టాల్సిందే" అని విద్యుత్ అధికారులు భీష్మించుకు కూర్చోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నిబంధనల ప్రకారం 1 కిలోవాట్ కనెక్షన్కు సుమారు రూ. 1,850 వసూలు చేయాల్సి ఉండగా, 2 కిలోవాట్ల పేరుతో రూ. 3,500 దాకా కట్టించుకుంటున్నారు. గృహ నిర్మాణ రుణాలు పొంది, ఇల్లు పూర్తి చేయడానికి అప్పులపాలైన పేద కుటుంబాలకు ఈ అదనపు రూ. 1500 భారం శాపంగా మారింది. విద్యుత్ శాఖ నిబంధనల ప్రకారం కనీసం 2 కిలోవాట్ల కనెక్షన్ తీసుకోవాలనే నిబంధన లేదని స్పష్టంగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయి సిబ్బంది తమ టార్గెట్లు పూర్తి చేసుకోవడం కోసమే ఈ తరహా అక్రమ వసూళ్లకు తెరలేపారని సర్వత్రా ఆరోపణలు వస్తున్నాయి. *కాట్రేనికోన గ్రామ శివారు అడవి పేటలో తాను అప్పులు చేసి కట్టుకున్న ఇంటికి వన్ కిలో వాట్ పెట్టుకోగా 2 కిలో వాట్ విద్యుత్ లోడు పెట్టుకోవాలని కాట్రేనికోన విద్యుత్ అధికారులు,* సిబ్బంది ఒత్తిడి చేశారని స్థానిక ఎస్సి కులానికి చెందిన జగడం లోవ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.ఆన్లైన్ ద్వారా తాము తక్కువ లోడ్కు దరఖాస్తు చేసుకున్నా, క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చే అధికారులు మాత్రం కనెక్షన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు.ప్రభుత్వ సాయంతో ఇళ్లను నిర్మించుకున్న లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, వారి ఇష్టపూర్వకంగా 1 కిలోవాట్ లోడ్కే కొత్త కనెక్షన్లు మంజూరు చేసేలా ఉన్నతాధికారులు తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధిక విద్యుత్ లోడు వినియోగించే వినియోగదారులపై అదనపు విద్యుత్తు లోడ్ కు సొమ్ములు వసూలు చేయకుండా పేదవారి వద్ద నిర్బంధంగా *సొమ్ములు వసూలు చేయడం తగదని సర్వత్ర నిరసన వ్యక్తం అవుతోంది..* నిబంధనల విరుద్ధంగా వ్యవహరిస్తూ, పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్న క్షేత్రస్థాయి అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు..
__________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
ముమ్మిడివరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 5️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/B84kn3XfnsiIxEJyhmXoyV?mode=gi_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼