#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #తిరుచానూరు బ్రహ్మోత్సవాలు #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
తిరుమల శ్రీవారి దేవేరి క్షేత్రమైన తిరుచానూరు మహా క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ముగిసిన సంధర్భంగా నేడు (26.11.2025) సాయంత్రం శ్రీ అమ్మవారి వార్షిక పుష్పయాగం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ కృష్ణ స్వామి వారి ముఖ మండపంలో బంగారు సర్వభూపాల వాహనంపై విశేష అలంకరణలో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లను కొలువుదీర్చి వివిధ రకాల పుష్పాలతో, బిల్వ పత్రాల, తులసి దళాలతో సహస్రనామ స్తోత్రంతో సహస్రనామార్చనను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా