S.HariBlr (Bangalore)
1K views •
#😇My Status #ఝాన్సీ లక్ష్మిబాయ్ జయంతి
19/11/2025ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా..
రచన: పత్తి సుమతి
ఊరు:శ్రీకాకుళం
అంశం:*టగ్ ఆఫ్ వార్-*(Tug of war*) -ఝాన్సీరాణి--జీవనపోరాటం..
(కథాకవనం)
********************
Yes నాలుగేళ్ళనాడేతల్లిని కోల్పోయిన...
*మణికర్ణిక*--*మను* ముద్దుపేరు-
రాణి (ఝాన్సీ)లక్ష్మీబాయి గా మారిన వైనం..
అవును తాతముత్తాతలు పీష్వాల- సైనికాధికారులు..
సనాతన బ్రాహ్మణ మరాఠా కుటుంబం.. పసితనం నుండే.. *టగ్ ఆఫ్ వార్*..
తండ్రి మోరోపంత్ శిక్షణ లో గుర్రపుస్వారీ కత్తి సాము సకలవిద్యలలో ప్రావీణ్యత.. ..
(The real struggle or tussel...A severe war for Supremacy ..)
స్వరాజ్యం కోసం మొదటి పునాది రాయి..వేసిన వీరనారి
ఆంగ్లేయుల గుండెల్లో గుబులు పుట్టించి...
మన స్త్రీ జాతి శౌర్య ధైర్యాలు ఎవరెస్ట్ శిఖరం పై పతాకంవోలె ప్రజ్వలింపజేసె
1835 నవంబర్ 19న
మను జననం
తండ్రి మోరోపంత్ బాజీరావు పీష్వా దర్బారులో ఉద్యోగి ...
తల్లి చనిపోవడంతో.. తండ్రి తో పాటు కత్తులు కటార్లు గుర్రపు సవారులు నిత్య కృత్యాలహేల...
తెల్ల గా ముత్యం లా మెరిసే మనూ అంటే-- బాజీరావు దత్తత పుత్రుడు నానాసాహెబ్ కు ..
నిర్భయంగా సూటి గా ధాటిగా.. ప్రవర్తించే మనూ బహెన్ అంటే వల్లమాలిన ప్రేమ..
వారి అన్యోన్యయత ఆత్మీయత చివరి శ్వాస వరకు ఈ నేల పై అలరారింది
టగ్ ఆఫ్ వార్-a test of strength & power-లో మెలకువలు నేర్పి తర్ఫీదు ఇచ్చిన గురువు నానాసాహెబ్ *అన్నే*
*అష్ట వర్షే భవత్కన్యా*-ఎనిమిళ్లు నిండిన పిల్లలకువివాహం తప్పనిసరి ఆచారం.... ...
భార్య గతించి ఎన్నో ఏళ్ళయినా..సంతానం లేనిఝాన్సీ మహారాజు గంగాధర రావు నాలుగు పదులు దాటిన వయస్సులో మనూని ఏరికోరి వరించాడు..
ఒకనాడు ..భర్తతో నాటకశాలలో రాణి- నాటకం వీక్షిస్తూ....
మధ్య నుండి నిష్క్రమణ
"మనూ... *అలా ఎందుకు చేసావో*?... మీకు యుద్ధవిద్యలు తప్ప మరేవీ పట్టవు???-"---భర్త ప్రశ్న... "*అవును..మహారాజా.
అవే ఇష్టం ..
మానసిక శారీరక ...
ఆరోగ్యాన్నిస్తాయి-
ఆపదలో కవచాలు గా ఉపకరిస్తాయి..
ఆ వీరనారి ముందు చూపు- సమాధానం...
పెళ్లైయిన మూడు సంవత్సరాలకు.. కుమారుడు కలిగి మూడు నెలలకే మరణం..
వారసుడు కోసం దత్తత స్వీకారం
ఆ మర్నాడే గంగాధరరావు మరణం (1853నవంబరు21)
బ్రిటిష్ వారు దత్తత స్వీకార నిషేధ చట్టం ప్రకటన
వీరనారి బ్రిటిష్ హుకుం నే హూంకరించి ఎదురించి వ్యతిరేక నవద్వారం తెరిచిన.. మహిళా సాహసి..
పోరాడి పోరాడి యుద్ధభూమిలో.. దత్తపుత్రుని వీపున కట్టుకుని...
గుర్రం మీద వీరవిహారం చేస్తూ బ్రిటిష్ ముష్కరుల చేతిలో వీరమరణం ..
ఆ పోరాట పటిమ చైతన్య జ్వాల.. తరువాత తరాలకు అందించిన టార్చ్ బేరర్..దీపధారి
ఆ నారీమణి సాహస
జన్యువు తరువాత తరాలకు అందకుండా పోయింది..
ఝాన్సీయే కాదు..సతారా, నాగపూర్, సంబల్ పూర్, ఉదయ్ పూర్ ,జోధ్ పూర్..ఆయా ప్రభువులకు ...సంతానం లేక..
దత్తత స్వీకార నిషేధ చట్టం కి బలి అయిన వారే ..
అదే జన్యు మహిమ.. తెల్లవారి గారడి మన శతకోటి దరిద్రాలకు...శత్రువులకు-- అనంతకోటి ఉపాయాలు
లక్ష్మీబాయి ప్రతిభ పాటవాలు..భరించలేని ఇంటి దాయాదులు సైతం బ్రిటన్ వైరి తో చేతులు కలిపిన.. దృష్టాంతాలు వేనవేలు.
భయానక సంక్లిష్ట పరిస్థితుల్లో భర్తను కోల్పోయిన మనూకి..
తన నేర్చుకున్నయుద్ధవిద్యలే పాఠాలై శస్త్రాలై అస్త్రాలై... *టగ్ ఆఫ్ వార్* .-*స్పిరిట్*....తో
ఢీ అంటే ఢీ కొట్టి ఆ మొక్కవోని మణిరత్నం నిటారుగా శాశ్వతంగా మనజాతి గుండెల్లో ఆరని నిప్పు రవ్వ లా.. .
భారత్ స్వాతంత్ర్య సమర ప్రధమ యోధురాలిగా అజరామరంగా నాందీవాక్యమైంది .
. నాలుగేళ్ల కే మాతృమూర్తి ని కోల్పోయిన పసికూన --.
ఆ ఆ మణికర్ణిక ....
ఆఆ వీరోచిత పోరాట పటిమ....
వర్తమాన కాలంలో తరచి తరచి చూసినా
ఆ ఆ అకుంఠిత దీక్ష కానరాదు..
పనికి మాలిన పేషన్స్ - అక్కరకు రాని కపట కాలక్షేప భక్తి ముసుగులో -బూటకపు సమూహాల ఆర్భాటాలు..
ఒక పచ్చని మొక్క కూడా నాటలేని .. ఇంటి వంట తో తమతమ పిల్లలకు.. పుష్టి గా భోజనం..పెట్టే సమయం లేని బీటెక్ అమ్మలు అమ్మమ్మలు ..
ఆకస్మిక సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొనలేక ఆత్మాహుతి తో ఆహుతి అవుతున్న పడతులు కోకొల్లలు..
నేటి అవినీతికి ఆలవాలమైన భారత్ లో శౌర్యం కరువై--
వేటూరి గీతం --దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి
లోకంలో..
ఇప్పటికీ ఆ-- పాట నిత్య కళ్యాణం పచ్చ తోరణం లా.. చెవుల్లో గింగురుమంటూ భయపెడుతూనే ఉంది ...
.మరుపురాని మరువలేని మహామానవి జీవనయాన మహాకావ్యం ..
చదవండి ఆనాటి రాణి వెలిగించిన విప్లవజ్వాలలు.. ఎగిసిపడే స్వరాజ్య కెరటాలకు స్వజాతీయులే అడ్డుగోడలై ...
బ్రిటిష్ ముష్కరుల చేతిలో కీలుబొమ్మ లైనారట..
అలా అలా ఒక స్వరాజ్య ఉషస్సు కోసం సాహసోపేత భారతరత్నం నేల రాలింది.. ఝాన్సీరాజ్యం మూగబోయింది..
మహోత్కృష్ట మహోన్నత మహా విప్లవం కి శాశ్వత దీపస్తంభం , తిరుగుబాటు కు పర్యాయపదం పౌరుషం కి ప్రతీక ఝాన్సీ లక్ష్మీబాయి
సీన్ మారాలి మహిళలూ ??!! మనజాతి కోసం దేశం కోసం ..
రుద్రమదేవి ,ఝాన్సీ లక్ష్మీబాయి ,సోదరి నివేదిత ,శ్రీకాకుళం శాసుమాన గున్నమ్మల గుండె సవ్వడులు కు ఊపిరి పోసి..
ప్రతీ అన్యాయాన్ని సమర్థంగా నిస్వార్థంగా...
అందరికోసం ఒక్కరు నిలబడి..ఒక్కరికోసం.
అందరు చేయి చేయి కలిపి సమైక్య శంఖారావం మ్రోగిద్దాం...
విషమించి విషమించి పరమ నికృష్టంగా మారుతున్న నేటి అవినీతి పోకడలను....
ఝాన్సీ లక్ష్మీబాయి సేనలు..గా ఏర్పడి ... ఆనాటి నేతాజీ కలలు సాకారం చేద్దాం...
ప్రతీ వనితా జనతా యువతా క్రాంతిదర్శి మణి కర్ణిక ఆత్మ అంతర్ఘోషకు మనమే ప్రతిధ్వనులమై ...
శౌర్య ధైర్య సాహసాలతో నలుగురిని పోగేసుకొని నడుద్దాం .. అక్షర సమరం చేద్దాం..
మార్పు కోసం చివరి శ్వాస వరకు..
దేశం కోసం ఈ కవన కరవాలం ఝులిపిస్తూనే....ఉందాం.. జైహింద్ ..👍🤝👍
11 likes
7 shares