ఈరోజు అధ్యాత్మిక విశిష్టత: సోమావతి అమావాస్య 🕉️ చాలా శక్తివంతమైన రోజు
10 Posts • 2K views
PSV APPARAO
941 views 4 months ago
#సోమావతి అమావాస్య రోజున పిల్లలు లేని వాళ్ళు శని గ్రహదోషాలు తొలగిపోవాలంటే రావి చెట్టుకు పూజ విధానం #ఈరోజు అధ్యాత్మిక విశిష్టత: సోమావతి అమావాస్య 🕉️ చాలా శక్తివంతమైన రోజు #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #🪔సోమావతి అమావాస్య...🌑 #సోమావతి అమావాస్య నేడు సోమవతి అమావాస్య.. స్త్రీలు రావి చెట్టుకు ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు? పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి హిందూ మతంలో సోమవతి అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే సోమవారం వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు. హిందూ మతం ప్రకారం అమావాస్య రోజున పూర్వీకుల ఆత్మశాంతి కోసం దానధర్మాలు, పిండ ప్రదానం చేస్తారు. అంతే కాదు అమావాస్య రోజున మహిళలు తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి పూజలు చేస్తారు. సోమవతి అమావాస్య రోజున స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. హిందూ మతంలో ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అయితే మహిళలు రావి చెట్టు చుట్టూ ఎందుకు ప్రదక్షణ చేస్తారు? ఈ రోజు తెలుసుకుందాం. సోమావతి అమావాస్య ఎప్పుడు? పంచాంగం ప్రకారం మార్గశిర బహుళ అమావాస్య డిసెంబర్ 30వ తేదీ సోమవారం తెల్లవారు ఝాము నుంచి మరుసటి రోజు తెల్లవారు జాము 3 గంటల వరకు సోమావతి అమావాస్య ఉంది. కాబట్టి డిసెంబర్ 30వ తేదీన సోమావతి అమావాస్యగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. అమావాస్య ముహూర్తం అమావాస్య సమయం: సోమావతి అమావాస్య పూజను ఉదయం 5 గంటల నుంచి 7:30 గంటల లోపు కానీ; ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటలలోపు కానీ చేసుకోవాలి. ఉదయం వీలుకానివారు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల లోపు చేసుకోవచ్చు. సోమవతి అమావాస్య రోజున స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. అమావాస్య రోజున సూర్యోదయంతో పవిత్ర నదులు, చెరువులు, లేదా గంగాజలంతో స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. గంగా స్నానం చేయడం సాధ్యం కాకపోతే ఇంట్లో నీటిలో కొన్ని చుక్కల గంగాజలం వేసి హర హర గంగా అంటూ పారాయణం చేస్తూ స్నానం చేయండి. ఇంట్లో లేదా గుడిలో ఆచార వ్యవహారాలతో పూజలు చేసి, తర్వాత రావి చెట్టుకు ప్రదక్షిణ చేయండి. పరిక్రమ తరువాత పేదలకు, సాధువులకు మీ సామర్థ్యం మేరకు బట్టలు, ఆహారాన్ని దానం చేయండి. రావి చెట్టు ప్రదక్షిణ.. విశిష్టత హిందూ మత విశ్వాసాల ప్రకారం వివాహిత స్త్రీలు సోమవతి అమావాస్య రోజున తెల్లవారుజామున స్నానం చేసిన తర్వాత ఆచారాలతో రావి చెట్టును పూజించాలి. సోమవతి అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల వైవాహిక జీవితంలో సంతోషం కలుగుతుందని నమ్ముతారు. దీనితో పాటు వివాహం ఆలస్యం అవుతున్న వారు ఇలా చేయడం వలన త్వరలో వివాహం జరుగుతుందని విశ్వాసం. అంతేకాదు జీవితంలో సమస్యల నుంచి  ఉపశమనం పొందుతారు. సమస్యలు క్రమంగా తగ్గుతాయి. సోమవారం అమావాస్య ప్రాముఖ్యత హిందూ మతంలో అమావాస్య, పౌర్ణమి తిధులు పూజకు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ రోజున పూజించడం వల్ల దేవతలు సులభంగా సంతసించి భక్తులను అనుగ్రహయిస్తారు. అమావాస్య రోజున గంగా , ఇతర పవిత్ర నదులలో స్నానం చేయడం ద్వారా అనేక యాగాలకు సమానమైన పుణ్యం లభిస్తుందని ..  కుటుంబంలో సిరి సంపదలు, సుఖ సంతోషాలు ఉంటాయని విశ్వాసం.
6 likes
11 shares
PSV APPARAO
826 views 4 months ago
#ఈరోజు అధ్యాత్మిక విశిష్టత: సోమావతి అమావాస్య 🕉️ చాలా శక్తివంతమైన రోజు #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #🪔సోమావతి అమావాస్య...🌑 #సోమావతి అమావాస్య #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ ఈరోజు  విశిష్టత: సోమావతి అమావాస్య పరమ పవిత్ర మైన రోజు సోమావతి అమావాస్య రోజున శివకేశవులను ఇలా పూజిస్తే - సకల ఐశ్వర్యాలు కలగడం ఖాయం! సోమావతి అమావాస్య పూజా ఫలం - శివుని భక్తితో పూజిస్తే చాలు - సుఖశాంతులు కలిగడం తథ్యం! సనాతన ధర్మంలో సోమావతి అమావాస్యకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. సోమావతి అమావాస్య శివారాధనకు విశిష్టమైనది. అత్యంత అరుదుగా వచ్చే సోమావతి అమావాస్య రోజు చేసే శివారాధన ఇంట్లో ప్రతికూల శక్తుల కారణంగా కలిగే అశాంతిని, దారిద్య్ర బాధలను పోగొడుతుందని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజున ఎలాంటి పరిహారాలు చేస్తే సుఖసంతోషాలు కలుగుతాయో ఈ కథనంలో తెలుసుకుందాం. సోమావతి అమావాస్య ఏ రోజున వస్తుంది? హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి నెలలో అమావాస్య వస్తుంది. అయితే అమావాస్య - సోమవారం రోజున వస్తే దానిని సోమావతి అమావాస్య అని అంటారు. సోమావతి అమావాస్య - పురాణ కథనం దక్ష ప్రజాపతి తాను చేస్తున్న యజ్ఞానికి తన కుమార్తె సతీదేవిని, అల్లుడైన పరమశివుని ఆహ్వానించకుండా వారిని అవమానిస్తాడు. శివుడు వద్దన్నా వినకుండా యజ్ఞానికి ఆహ్వానం లేకుండా వెళ్లిన సతీదేవి అవమానానికి గురై శరీర త్యాగం చేస్తుంది. సతీదేవి మరణ వార్త తెలిసి ఆగ్రహించిన శివుడు తన జటాజూటం నుంచి వీరభద్రుని సృష్టిస్తాడు. సమస్త ప్రమద గణాలతో కలిసి వీరభద్రుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి యాగానికి వచ్చిన వారందరిని చితకబాదుతాడు. శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు శివగణాల చేతిలో చంద్రుడు కూడా చావు దెబ్బలు తింటాడు.ఆ సమయంలో ఒంటి నిండా గాయాలతో తీవ్రమైన బాధతో చంద్రుడు పరమశివుని శరణు వేడుకుంటాడు. చంద్రుని అవస్థను చూసి మనసు కరిగిన భోళాశంకరుడు, త్వరలో రానున్న అమావాస్యతో కూడిన సోమవారం నాడు తనకు అభిషేకం జరిపిస్తే తిరిగి చంద్రుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడని అభయమిస్తాడు. ఆనాటి నుంచి సోముడు అంటే చంద్రుని పేరిట సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజును సోమావతి అమావాస్యగా జరుపుకుంటున్నారు. సోమావతి అమావాస్య ఎప్పుడు? మార్గశిర బహుళ అమావాస్య డిసెంబర్ 30వ తేదీ సోమవారం తెల్లవారు ఝాము నుంచి మరుసటి రోజు తెల్లవారు జాము 3 గంటల వరకు సోమావతి అమావాస్య ఉంది. కాబట్టి డిసెంబర్ 30వ తేదీన సోమావతి అమావాస్యగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. సోమావతి అమావాస్య పూజకు శుభ సమయం సోమావతి అమావాస్య పూజను ఉదయం 5 గంటల నుంచి 7:30 గంటల లోపు కానీ; ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటలలోపు కానీ చేసుకోవాలి. ఉదయం వీలుకానివారు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల లోపు చేసుకోవచ్చు. సోమావతి అమావాస్య పూజా విధానం సోమవతి అమావాస్య రోజున నదిలో స్నానం చేసి పరమశివునికి గంగా జలంతో, పంచామృతాలతో అభిషేకం చేస్తే, విశేషమైన ఫలితం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. వ్యాస మహర్షి రచించిన శివ పురాణం ప్రకారం సోమావతి అమావాస్య రోజు పుణ్యనదుల్లో స్నానం ఆచరించినవారికి వేయి గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుందని తెలుస్తోంది. సోమావతి అమావాస్య రోజు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం సోమావతి అమావాస్య రోజున రావిచెట్టుకు, శ్రీ మహా విష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తే దరిద్రం పోతుంది.రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. వీలు కాని వారు శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ రావి చెట్టుకు 11 సార్లు ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది. శివకేశవులకు నైవేద్యంగా సమర్పించిన పండ్లను బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి.సోమావతి అమావాస్య రోజు ఇంటికి ఈశాన్య దిక్కులో, సాయం సంధ్య వేళ ధనలక్ష్మి దేవి ప్రీతి కోసం ఆవునేతితో దీపం వెలిగించి ఆ ప్రమిదలో కుంకుమ పువ్వు, పచ్చ కర్పూరం వేసి నమస్కరించుకుంటే దరిద్రం పోయి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. సోమావతీ అమావాస్య నాడు అన్నదానం చేస్తే అనంత కోటి పుణ్య ఫలం లభిస్తుందని విశ్వాసం. కుటుంబ ఐక్యత కోసం ఇలా చేయండి! సోమవతి అమావాస్య రోజున నల్ల చీమలకు పంచదార కలిపిన పిండిని ఆహారంగా పెట్టడం వలన జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోయి, కుటుంబంలో ఐక్యత వృద్ధి చెందుతుంది. శివ పురాణంలో సూచించిన ఈ పరిహారాలు చేయడం వలన ఇంట్లోని పేదరికం తొలగిపోయి ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది. - ఓం నమః శివాయ!
20 likes
13 shares