విజయవాడ

716 Posts • 789K views
విజయవాడ కనకదుర్గమ్మ కి గాజులు విశిష్టత,విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ తల్లికి గాజులు అంటే అత్యంత ప్రీతి, అమ్మవారిని సౌభాగ్య దాయినిగా కొలుస్తారు కాబట్టి భక్తులు తమ ఇంట్లో సౌభాగ్యం, సుమంగళి యోగం కోసం అమ్మవారికి గాజులు సమర్పిస్తారు, పురాణం ప్రకారం మహిషాసురుడిని సంహరించిన తర్వాత అమ్మవారు ఇంద్రకీలాద్రిపై స్వయంభువుగా వెలసింది, అప్పుడు దేవతలు అమ్మవారిని శాంతింపజేయడానికి పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ, గాజులతో అలంకరించారు అప్పటి నుండి అమ్మవారికి గాజుల అలంకరణ ఎంతో విశిష్టమైనది అయ్యింది, ప్రతి శుక్రవారం, మంగళవారం భక్తులు వేలాదిగా గాజులను అమ్మవారికి మొక్కుగా చెల్లిస్తారు, దసరా నవరాత్రుల సమయంలో అమ్మవారికి గాజుల అలంకరణ చాలా వైభవంగా చేస్తారు, భక్తులు సమర్పించిన గాజులను అమ్మవారి కళ్యాణ మండపంలో ఉంచుతారు, పెళ్లి కాని ఆడపిల్లలు, సంతానం కోసం ఎదురుచూసే మహిళలు అమ్మవారికి గాజులు మొక్కుకుంటే వారి కోరిక తప్పక నెరవేరుతుందని ప్రగాఢ నమ్మకం, అమ్మవారి గాజులను ప్రసాదంగా తీసుకెళ్లి పూజ గదిలో పెట్టుకుంటే ఇంట్లో ఎప్పుడూ సౌభాగ్యం, శాంతి నిండి ఉంటుందని, పసుపు కుంకుమలకు లోటు ఉండదని భక్తుల విశ్వాసం, అందుకే కనకదుర్గమ్మ గుడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ అమ్మవారికి గాజులు సమర్పించడం మర్చిపోరు ఇంట్లో సౌభాగ్యం : అమ్మవారి గాజులు ప్రసాదంగా ఇంటికి తెచ్చుకుంటే పసుపు కుంకుమలకు లోటు ఉండదు. #శ్రీ కనక దుర్గ దేవి #కనక దుర్గమ్మ #కనక దుర్గ #విజయవాడ కనక దుర్గమ్మ #🔱విజయవాడ కనక దుర్గమ్మ
426 likes
43 shares