🌺సూర్యనారాయణ స్వామి🌺
13 Posts • 12K views
🌿🌼 మాఘ పురాణం - 12వ అధ్యాయము 🌼🌿 పుణ్యక్షేత్రములలో మాఘస్నానము అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన ఫల మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా “మహర్షీ! మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని. నాకు మరొక సంశయం కలిగింది. మాఘమాసమందు ఏయే తీర్థములు దర్శింపవలెనో సెలవివ్వమని వినమ్రుడై కోరగా వశిష్ఠుల వారు - దిలీప మహారాజా! మాఘ స్నానములు చేయుటయందు ఆసక్తి గలవారలకు ముఖ్యమగు తీర్థ మహిమల గురించి వివరిస్తాను. శ్రద్ధగా ఆలకించు. మాఘమాసంలో నదీస్నానం ముఖ్యమైనది. మాఘ స్నానము చేయక తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకం. మాఘమాసంలో ఏ నదిలోని నీరైనను గంగనీటితో సమానము. మాఘమాసంలో నదీస్నానం సర్వ పాపహరమైనది ఆవశ్యకమైనది. అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరత ఖండములో అతి ప్రధానమైన గంగానది సముద్రములో కలియుచోట మాఘ స్నాన మాచరించిన ఏడేడు జన్మలలోని పాపములు నశించిపోతాయి. మాఘమాసంలో నదీస్నానంతోపాటు విష్ణు దేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు మూడువందల అరవై పుణ్యక్షేత్రములు దర్శించిన యెడల గొప్ప ఫలం కలుగుటయే గాక మళ్ళీ జన్మ అనేది కలుగదు. పడమటి కనుమల దగ్గర త్ర్యయంబకమను ఒక ముఖ్యమైన క్షేత్రం ఉన్నది. అక్కడే పవిత్ర గోదావరీనది జన్మించింది. గౌతముడు తన గోహత్యా దోషమును పోగొట్టుకొనుటకు ఈశ్వరుని గురించి ఘోరతపస్సు చేసి, గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతమునకు ప్రవహింప చేసాడు. మాఘమాసంలో గోదావరియందు స్నానం చేసినయెడల సకలపాపములు తక్షణం హరించి పోవుటయే గాక ఇహమందు పరమందు సుఖపడతారు. గౌతమీనదిలో మరికొన్ని ప్రసిద్ధములగు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వమును చాటుతున్నవి. ‘పరంతప’ అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారముగా వెలసి ఉన్నాడు. దానికి ఆవల ప్రభావమను క్షేత్రం గలదు. ఆ క్షేత్రం బ్రహ్మ హత్యా మహాపాపములను సహితము పోగొట్టగలదు. ఇందుకొక ఇతివృత్తము చెపుతాను సావధానుడవై ఆలకించు. విష్ణుమూర్తి నాభికమలమున పుట్టిన బ్రహ్మకు, ఈశ్వరునికి ఐదేసి తలలు ఉండేవి. ఈశ్వరునకు పంచవక్త్రుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. బ్రహ్మదేవుడు నాకు అయిదు తలలున్నవి, నేనే గొప్పవాడనని అనగా నాకు ఐదు తలలున్నవి నేనే గొప్ప వాడనని శివుడు వాదించారు. ఇద్దరూ గర్వముతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలివాన వలె వారిద్దరిమధ్య కలహము పెద్ది అయింది. ఇద్దరూ యుద్ధముచేయగా శివుడు బ్రహ్మయొక్క ఐదవ తలను నరికివేసాడు. అందువలన శివునకు బ్రహ్మ హత్యాపాతకము చుట్టుకున్నది. శివుడు నరికిన బ్రహ్మ తలను చేతితో పట్టుకొని ముల్లోకములు తిరుగుతూ ఉండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మ తల ఎండిపోయి పుర్రెగా అయింది. ఈశ్వరుడు ఆ పుర్రెతోనే భిక్షమడుగుచూ భూలోకానికి వచ్చాడు. ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి ‘భిక్షాందేహి’యని అనగా గృహిణులు భిక్షపట్టుకొని గుమ్మము వద్దకు రాగా శివుని మోహనాకారమును చూచి మోహితులై భిక్షవేసి శివుని వెంట వెళ్ళిపోతున్నారు. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి, కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక, ఈతనికి పురుషత్వము నశించుగాక అని శపించారు. ఈశ్వరుడు చేసేది లేక జారి క్రిందపడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయినాడు. లింగాకారంగా మారినందువలన ఎనలేని తేజస్సుతో ఆ లింగము ప్రకాశించుచుండెను. కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవించునా? అన్నట్లు భయంకరముగా ఉన్నది. బ్రహ్మ, విష్ణువు శివుని వద్దకు వచ్చి వానిని ఓదార్చి ప్రయాగ క్షేత్రమునకు తీసుకుని వెళ్ళగా అచ్చట శివునికున్న బ్రహ్మహత్య పాపము పోయింది. భూలోకమునకు వచ్చిన శివుడు లింగాకారముగా మారినందున అప్పటినుండి భక్తులు ఆ లింగమునే పూజించుచు శివసాన్నిధ్యము పొందగలుగుతున్నారు. ఓం దుం దుర్గాయై నమః #☸🙏సూర్యనారాయణ స్వామి #🌞శ్రీ సూర్యనారాయణ స్వామి🌞 #🌞 శ్రీ సూర్యనారాయణ స్వామి 🌞 #ఓం శ్రీ సూర్యనారాయణ స్వామి 🙏🏻 # ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ నమో నమః
17 likes
76 shares
MAAGHA PURANAM -- 24 24వ అధ్యాయము విశ్వామిత్రునికి వానరముఖము కలుగుట - గంధర్వ స్త్రీ వృత్తాంతము మాఘమాసమందలి నదీస్నానము మనుజులకే కాక దేవతలకు, గంధర్వులకు కూడ పరమ పవిత్రమైనది. మాఘమాసంలో నొక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానము చేసాడు. అతని భార్య తానుమాత్రం స్నానము ఆచరించనని చెప్పుట వలన ఆమె దైవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేక పోయింది. ఆమెను విడిచిపెట్టి ఆ గందర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి ఆయన్ని వయ్యారంగా క్రీగంట చూసింది. ఆమె అందము, యౌవ్వనము చూసిన విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించాడు. ఇద్దరూ కామక్రీడలతో తేలియాడసాగారు. గంధర్వుడు భార్యను వెదకుకొనుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు, గంధర్వస్త్రీ క్రీడిస్తూ ఉన్నారు. ఆ దృశ్యమును చూచి మండిపడుచు విశ్వామిత్రుని “నువ్వు తపస్వివైయుండి కూడా కామతృష్ణ గల వాడవైతివి గాన నీకు కోతిముఖము సంభవించుగాక అని, “ఓసీ కులటా! నీవు పాషాణమై పడివుండు”మని భార్యను శపించి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానరముఖముతో ఉండగా నారదుడు ఈవిషయం తెలుసుకొని విశ్వామిత్రుని వద్దకు వచ్చి “విశ్వామిత్రా! క్షణభంగురమైన తుచ్ఛ కామవాంఛకు లోనై నీ తపశ్శక్తి అంతా వదులుకున్నావు. గంగానదిలో స్నానం చేసి నీ కమండలముతో గంగాజలం తెచ్చి ఈ పాషాణముపై చల్లు అని నారదుడు చెప్పగా విశ్వామిత్రుడు గంగానదిలో స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణము పై చల్లాడు. ఆ పాషాణము గంధర్వ స్త్రీ రూపము ధరించి నారదునికి నమస్కరించి గంధర్వ లోకమునకు వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయాడు. #☸🙏సూర్యనారాయణ స్వామి #🌞శ్రీ సూర్యనారాయణ స్వామి🌞 #🌞 శ్రీ సూర్యనారాయణ స్వామి 🌞 #ఓం శ్రీ సూర్యనారాయణ స్వామి 🙏🏻 # ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ నమో నమః
21 likes
16 shares