సోషల్ మీడియా

612 Posts • 7M views
P.Venkateswara Rao
647 views 11 days ago
#soshal meediyaa *సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ థియరీ..❗* MARCH 25, 2026🎯 ప్రతి ఐదేళ్లకు ఒకసారి భారత్లో ఏదో ఒక సంక్షోభం తలెత్తుతోంది. వీటన్నింటినీ లింక్ పెడుతూ, సోషల్ మీడియాలో ఆసక్తికర కథనం ప్రచారంలో ఉంది. ముందుగా 2016 విషయానికొస్తే.. ఆ ఏడాది భారత్లో పెద్ద నోట్లు రద్దు చేశారు. ఆ టైమ్లో ఇంట్లో శుభకార్యాలు, పెళ్లిళ్లు పెట్టుకున్నవాళ్లు చాలా ఇబ్బంది పడ్డారు. ఇంట్లో పెళ్లికి అన్నీ ఉన్నాయి, అతిధులున్నారు. గ్యాస్ కూడా ఉంది. కానీ చేతిలో డబ్బుల్లేవు. నోట్ల రద్దు జరిగిన ఐదేళ్లకు కరోనా వచ్చింది. అప్పుడు కూడా పెళ్లిళ్లు పెట్టుకున్నవాళ్లు ఇబ్బందులు పడ్డారు. ఇంట్లో పెళ్లి పెట్టుకొని, ముందు జాగ్రత్తగా చేతిలో నగదు పెట్టుకున్నారు. ఇంట్లో గ్యాస్, వీధిలో పెట్రోల్ కూడా అందుబాటులో ఉంది. కానీ పెళ్లికి అతిథుల్లేరు.. కట్ చేస్తే, మరో ఐదేళ్లు గడిచిపోయాయి. ఈసారి గల్ఫ్ యుద్ధం వచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసికట్టుగా ఇరాన్పై యుద్ధం చేస్తున్నాయి. ఇరాన్ ప్రతిదాడులతో గల్ఫ్ దేశాలు అట్టుడికిపోతున్నాయి. ఇప్పుడు కూడా పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఈసారి పెళ్లి పెట్టుకున్నవాళ్లు చేతిలో నగదు ఉంచుకున్నారు. గత అనుభవాల దృష్ట్యా అతిథుల్ని ముందుగానే ఆహ్వానించి పెట్టుకున్నారు. కానీ ఇంట్లో గ్యాస్ లేదు, బయట పెట్రోల్ లేదు. ఇలా చూసుకుంటే, మరో ఐదేళ్ల తర్వాత ఏం జరుగుతుందోనంటూ ఓ పోస్టు సోషల్ మీడియాలో కనిపిస్తోంది. 2031 నాటికి ఇంట్లో అన్నీ ఉంటాయని.. చేతిలో డబ్బు, గ్యాస్, పెట్రోల్, అతిథులు అంతా సిద్ధంగా ఉంటారని.. కానీ పెళ్లిళ్లు మాత్రం ఉండవంటూ ఆసక్తికర పోస్టు వైరల్ అవుతోంది. నిజమే.. ప్రస్తుతం పెళ్లిళ్లపై యువత విముఖత చూపిస్తోంది. ఎక్కడ చూసినా పెళ్లికాని ప్రసాదులే కనిపిస్తున్నారు. మరో ఐదేళ్ల తర్వాత పెళ్లిపై యువత మైండ్సెట్ పూర్తిగా మారిపోయేలా ఉంది.
8 likes
11 shares