#⛳భారతీయ సంస్కృతి
రాజస్థాన్లోని డూంగర్పూర్ జిల్లా బిచ్చివారా పోలీస్ స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. తన సమస్యపై ఫిర్యాదు చేసేందుకు ఓ వృద్ధుడు పోలీస్ స్టేషన్కు వచ్చాడు. అయితే డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ టేబుల్పై కాళ్లు పెట్టుకుని కూర్చున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజలతో వ్యవహరించే తీరు ఇదేనా అంటూ నెటిజన్లు ప్రశ్నించారు. ఘటనపై స్పందించిన డూంగర్పూర్ పోలీసులు సంబంధిత మహిళా కానిస్టేబుల్ను వెంటనే సస్పెండ్ చేసి, శాఖాపరమైన విచారణ
ప్రారంభించారు.