Omnamahashivaya

36 Posts • 74K views
నంది చెవిలో చెబితే..అనుకున్న పనులన్నీ.. క్షణంలో అయ్యిపోతాయట..........!! సాధారణంగా దేవాలయాలలో భక్తులు తమ కోరికలను నంది చెవిలో చెబుతారు. దీనికి ఒక కథ ఉంది. ఒకసారి శివుడు, పార్వతి, నంది ధ్యానంలో నిమగ్నమయ్యారట. అదే సమయంలో జలంధరుడు అనే రాక్షసుడు పార్వతి మాతను అపహరించాలని ప్రయత్నం చేశాడు. ఈ చర్య ముందుగానే తెలుసుకున్న వినాయకుడు ఈ విషయం తన తండ్రికి చెప్పాలనుకున్నాడు.. కాని వినాయకుడు, ఇతర దేవతలు ధ్యానంలో ఉన్న రుద్రుడి దగ్గరికి వెళ్ళే సాహసం ఎవ్వరు చెయ్యలేదట. అప్పుడు నంది చెవిలో ఆ విషయం చెబితే ఖచ్చితంగా శివునికి చేరుతుందని నందికి ఆ విషయం చెప్పారట. ఆ విషయం తెలుసుకున్న వెంటనే శివుడు రాక్షసుడిని సంహారించారు. ఇక అప్పటి నుండి నంది చెవిలో చెబితే శివునికి చేరుతుందని ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. స్వస్తి..!! #తెలుసుకుందాం #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #om namah shivaya #ఓం నమః శివాయ
85 likes
56 shares