రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్.పి.ఐ) తెలంగాణ రాష్ట్రం
160 Posts • 27K views
ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా లక్ష్యం - రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ కరీంనగర్ టౌన్,అక్టోబర్19 (తెలంగాణ పత్రిక) ప్రజా సమస్యలపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగం పరిపాలన ప్రకారమే,ప్రజా సమస్యలపై ఉద్యమం చేస్తుందని ప్రజల కోసం ఏర్పడింది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ అన్నారు. కరీంనగర్ లో రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని ముఖ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు అసలైన నిరుపేదలకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్.పి.ఐ పార్టీ ప్రజల కోసం పనిచేయాలని పార్టీ కార్యకర్తలు ప్రజల వద్దేనే ఉండి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నిజమైన నిరుపేదలకు పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీని బలపతం చేయాలని ముఖ్య కార్యకర్తలకు ప్రజలలోకి తీసుకెళ్లి పార్టీ ద్వారా వారి సమస్యలను పరిష్కరించాలని పార్టీ ముఖ్య కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారుకూరి శ్రీనివాస్,రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మొగురం మీరియా,కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కాశిపాక అజయ్, పెద్దల్లి చంద్రకాంత్ యాదవ్, మంచిర్యాల మహిళా జిల్లా అధ్యక్షురాలు జగదంబల లలిత, వరంగల్ జిల్లా అధ్యక్షుడు ముత్యం అశోక్ రెడ్డి, గందే కోమురయ్య ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. #రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్.పి.ఐ) తెలంగాణ రాష్ట్రం #రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్.పి.ఐ) #రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్.పి.ఐ) republican party of india (rpi) telangana state .
10 likes
10 shares