#హనుమాన్ జయంతి 🔱 హనుమాన్ విజయోత్సవం 🕉️🙏 #హనుమాన్ విజయోత్సవం #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #హనుమత్ విజయోత్సవం #హనుమాన్ విజయోత్సవం💐🎂 *శ్రీ ఆంజనేయం*
*హనుమత్ విజయోత్సవం*
*మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం*
*వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి*
మనోవేగ వాయువేగములవంటి వేగముగలవాడు, ఇంద్రియములను జయించినవాడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, వానరజాతిలో ముఖ్యుడు, శ్రీరామదూత హనుమత్ విజయోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా హనుమాన్ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి.
హసుమంతుడు వాయుపుత్రుడు. అంజనా తనయుడు. పుంజికస్థల అనే అప్సరస శాపకారణంగా కుంజరుడనే వానరశ్రేష్ఠునికి కుమార్తెగా అంజనాదేవిగా జన్మించింది. ఆమెను కేసరి అనే వానరుడికిచ్చి వివాహం చేశారు. వారు చాలాకాలం సంసారం చేశాడు. సంసారంతో విసిగిపోయిన కేసరి తపస్సుకు వెళ్తూ వాయుదేవుడిని ఆరాధిస్తూ కాలం గడపమని చెప్పి వెళ్ళాడు. భర్త ఆజ్ఞమేరకు అంజనాదేవి వాయుదేవుడిని సేవిస్తూ ఉండేది. అంజన భక్తికి వాయుదేవుడు ప్రసన్నుడై తన గర్భమందున్న శివుడి తేజస్సు ఆమెకు యివ్వగా ఆమె గర్భం దాల్చింది. అలా ఆమెకు జన్మించిన కుమారుడే ఆంజనేయస్వామి!
_చిరంజీవి హనుమ_
హనుమంతునికి చిరంజీవి అనే మరోపేరుంది. ఆయన చిరంజీవి కావడానికి, హనుమంతుడనే పేరు ఏర్పడడం వెనుక ఆసక్తికరమైన గాథ వుంది.
ఆంజనేయుడు చిన్నతనంలో ఒకరోజు ఆకలిగా వున్న సమయంలో సూర్యుడిని పండుగా భావించి పట్టుకొనబోయాడు.. ఆ రోజు సూర్యగ్రహణం కనుక సూర్యభగవానుడిని మింగేందుకు రాహువు వచ్చి సిద్ధంగా వున్న సమయంలో ఆంజనేయుడు సూర్యుడిని పట్టుకొనబోవడంతో, ఈ విషయాన్ని ఇంద్రుడి వద్దకు వెళ్ళి రాహువు వివరించాడు. దీనితో కోపోద్రిక్తుడైన ఇంద్రుడు ఆంజనేయుడి వద్దకు చేరి... తన చేతిలో వున్న వజ్రాయుధంతో ఆంజనేయుడి దవడపై కొట్టాడు. ఈ దెబ్బకు ఆంజనేయుడు స్పృహ తప్పిపోయాడు. తన కుమారుడు స్పృహతప్పడం చూసి ఆవేశానికిలోనైన వాయుదేవుడు వాయువును స్తంభింపజేశాడు. గాలి లేక లోకాలన్నీ అల్లకల్లోలం అయ్యాయి. దేవతలందరు వాయుదేవుడి వద్దకు వచ్చి.. వాయుదేవుడి కోపానికి కారణం కనుక్కుని.. ఆంజనేయుడి వద్దకు చేరి అనేక వరాలను ప్రసాదించారు. ఈ వరాలవల్ల ఆంజనేయుడు చిరంజీవి అయ్యాడు. అంతేకాకుండా రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్చిల్లిన సమయంలో సంజీవినీ పర్వతం తెచ్చి లక్ష్మణుడిని బ్రతికించినందుకు సంతోషించి శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయుడిని చిరంజీవిగా ఆశీర్వదించినట్లు కథనం. కాగా, ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టడం వల్ల ఆంజనేయస్వామి వారి దవడకు దెబ్బతగిలి. సొట్టపోయింది. దవడను హనువు అంటారు. హనువు దెబ్బతినడం వల్ల ఆంజనేయస్వామి వారికి హనుమంతుడు అనే పేరు ఏర్పడింది.
_కీర్తిస్తే పొంగిపోయే హనుమ_
దేవతల నుంచి అనేక వరాలను పొందిన ఆంజనేయుడు వరబలం, బాల్యచేష్టలతో మహర్షుల ఆశ్రమాలకు వెళ్ళి అల్లరి పనులు చేయసాగాడు. దీనితో దేవతలు ప్రసాదించిన వరాలను గురించి తెలిసిన మహర్షులు ఆంజనేయుడిని ఏమీ అనేవారు కాదు. రానురానూ అల్లరి పనులు అధికం కావడంతో మహర్షులు - "ఏ బలంతో నీవు మమ్ములను బాధిస్తూవున్నవో... ఆ బలం నీకు తెలియకుండా పోతుంది. ఎదుటివారు చెబితే గానీ నీ బలం నీకు తెలియదు. నీ కీర్తి పొగిడే కొద్దీ నీ బలం వృద్ధి అవుతుంది" అని శపించారు. అందువల్ల ఆంజనేయుడు తన బలాన్ని తాను మర్చిపోయినట్లు కథనం. అందువల్లనే స్వామి వారిని కీర్తిస్తే ఆయన బలం వృద్ధి చెంది.. పొంగిపోయి సహాయం చేస్తాడు.
_నవవ్యాకరణ పండితుడు_
శ్రీ ఆంజనేయస్వామి వారికి విద్య నేర్పిన గురువు సూర్యభగవానుడు! ఒకసారి ఆంజనేయుడు ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడి వద్దకు వెళ్ళి "నేను మీ వద్ద విద్య నేర్చుకోవాలనుకుంటున్నాను" అని చెప్పాడు. దీనితో "నేను నిరంతరం సంచరిస్తుంటాను కదా! నా దగ్గర విద్యను ఏవిధంగా నేర్చుకుంటావు?" అని ప్రశ్నించాడు.
సూర్యుడి మాటలను వింటూనే ఆంజనేయుడు శరీరాన్ని పెద్దది చేసి ఉదయాద్రిపై ఒక కాలుసు, అస్తాద్రిపై మరోకాలును వుంచి నిలబడ్డాడు. సూర్యుడు ఆంజనేయుడి శక్తిని చూసి ఆశ్చర్యపడి విద్య నేర్పడానికి అంగీకరించాడు. హనుమంతుడు సూర్యుడి ముందు నడుస్తూ విద్యను నేర్చకున్నాడు. వేద వేదాంగాలు, సకలశాస్త్రాలను నేర్చుకుని నవవ్యాకరణ పండితుడుగా ఆంజనేయుడు పేరు పొందాడు. ఆయన భాషా పటిమను రామాయణంలో పలుచోట్ల చూడవచ్చు.
_సిందూరప్రియుడు_
ఆంజనేయస్వామి సిందూరప్రియుడు. స్వామి వారి నుదుట సిందూరాన్ని ధరింపజేయడం, శరీరమంతా సిందూరం పూయడం హనుమదాలయాల్లో చూస్తుంటాం. సిందూరం అంటే ఆంజనేయుడికి ఇష్టం కావడానికి వెనుక ఆసక్తికరమైన పురాణగాథ ఒకటి వుంది. ఒకనాడు హనుమంతుడు. సీతాదేవి వద్దకు వెళ్ళి "నాకు ఆకలిగా వుంది ఏమైనా తినేందుకు పెట్టండి" అని సీతాదేవిని అడిగి వేచి ఉన్నాడు. స్నానం అనంతరం తిలకధారణలో భాగంగా, పాపిట. సిందూరమును ధరించి వచ్చిన సీతాదేవిని చూసిన ఆంజనేయుడు -"అమ్మా! నుదుట తిలకం ధరించారు కదా! ఇంకా పాపిటపై సిందూరం ఎందుకు?" అని ప్రశ్నించాడు.
"ఈ విధంగా ధరించడం వల్ల నీ స్వామి వారికి ఆయుషు వృద్ధి చెందుతుంది" అని సమాధానం యిచ్చింది.
మరునాడు ఆంజనేయుడు శిరస్సు నుండి పాదాల వరకూ శరీరమంతా సిందూరాన్ని ధరించి సభకు వచ్చాడు. ఆంజనేయుడి “వేషధారణ చూసి సభలోని వారందరూ నవ్వడం ప్రారంభించారు. దీనితో శ్రీరామచంద్రమూర్తి - ఆంజనేయుడు సిందూరంను శరీరమంతా పూసుకొనుటకు కారణం తెలుసుకుని సంతోషించి-
"హనుమా! నీ వంటి అనన్యభక్తుడు మరొకడు వుండడు. ఈ రోజు మంగళవారం. మంగళవారం నాడు నిన్ను ఎవరైతే సిందూరంతో పూజిస్తారో... వారికి నేను. ప్రసన్నుడనై వారి కోరికలను నెరవేరుస్తాను" అని వరం ప్రసాదించారు.
_తమలపాకులంటే ఇష్టం_
ఆంజనేయస్వామిని తమలపాకులతో పూజించడం ఆచారం. ఆంజనేయస్వామి వారికి తమలపాకులంటే ఇష్టం కలగడానికి వెనుక ఓ గాథ వుంది. శ్రీరాముడి పట్టాభిషేకం జరిగిన కొంతకాలం తర్వాత ఒకనాడు ఆంజనేయుడు మధ్యాహ్న సమయంలో అంతఃపురంలోని శ్రీరామచంద్రమూర్తి వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో భోజనాంతరం సీతాదేవి శ్రీరాముడికి తమలపాకులు మడిచి అందిస్తూ వుంది. శ్రీరాముడు తాంబుల సేవనం చేస్తూ వున్నారు. శ్రీరాముల వారి నోరు ఎరుపుగా వుండడం చూసిన ఆంజనేయుడు-
"స్వామీ! తమరి నోరు ఎరుపుగా వుంది. అందుకు కారణం ఏమిటి?" అని ప్రశ్నించాడు. దీనితో
"ఇవి తమలపాకులు, వీటిలో పోకచెక్కలు, సున్నంవేసి భోజనానంతరం సేవించడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది" అని సీతాదేవి సమాధానం ఇచ్చింది.
ఈ మాటలను విన్న హనుమంతుడు. సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళి కొద్దిసేపటి తర్వాత శరీరమంతా తమలపాకులను అలంకరించుకుని గంతులు వేస్తూ వచ్చాడు. దీనిని చూసిన రాముడు నవ్వుతూ-"ఎందుకు తమలపాకులను శరీరమంతా అలంకరించుకున్నావు?" అని హనుమంతుడిని ప్రశ్నించాడు.
"నోటిలో కొన్ని ఆకులను వేసుకుంటేనే -మీ ఆరోగ్యం వృద్ధి చెందుతుంది కదా.... మీ ఆరోగ్యం ఎంతో వృద్ధి చెందాలని నేను శరీరమంతా తమలపాకులను ధరించాను" అని హనుమంతుడు సమాధానం ఇచ్చాడు. ఈ మాటలను విని ఆంజనేయుడిని మెచ్చుకున్న శ్రీ సీతారాములు"నీకు తమలపాకులతో ఎవరైతే పూజలు చేస్తారో.... వారికి సకలసౌభాగ్యములు కలుగుగాక" అని వరం ప్రసాదించారు.
ఆంజనేయస్వామి ఎంత మహిమాన్వితులో వారి వాలం కూడా అంతే పవిత్రం, హనుమంతునికి తోక పూజను నలభై రోజులపాటు చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆంజనేయస్వామి ప్రదక్షిణల ప్రియుడు.
#namashivaya777
*నిరంతరం ఆధ్యాత్మికం*
https://whatsapp.com/channel/0029Va4YUC6DeONFF8EDwQ2V