🛕కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి🙏
36 Posts • 4K views
🌺 కాణిపాకం 🌺 ఒక గ్రామంలో అంగవైకల్యంతో ముగ్గురు సోదరులు ఉండేవారు. వారిలో ఒకరికి చెవి, మరొకరికి నోరు, ఇంకొకరికి కళ్ళు పనిచేయవు. వారు కష్టపడి పనిచేసి ఒక భూమిని సాగు చేసుకుంటున్నారు. ఒక బావిలో నీరు వ్యవసాయ పనులకు వాడుకునే వారు. బావి క్రమంగా ఎండిపోవడంతో దానిని తవ్వే ప్రయత్నం చేశారు. తవ్వడం మొదలు పెట్టిన కొంత సేపట్లోనే వారికి బావిలో ఏదో వున్నట్ల నిపించింది. ఇంకాస్త తవ్వేలోగా అక్కడ నుంచి రక్తం ఏరులై పారి బావి అంతటా నిండి పోయింది. ఆశ్చర్యపోయి చూసిన అన్నదమ్ములకి అందులో నుంచి ఒక వినాయకుడి విగ్రహం కనిపించింది. స్వయంగా అక్కడ వెలిసిన వినాయకుడు ఆ ముగ్గురి అంగవైకల్యాన్ని తొలగించాడు. ఈ విషయం తెలిసిన గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయి, దేవునికి పూజలు చేయడం మొదలుపెట్టారు. ప్రజలందరూ వినాయకుడు స్వయంగా వెలిశాడని స్వయంభు వినాయక స్వామి అని అంటారు. దేవుడికి ఆలయం నిర్మించి కాణిపాకం వినాయక స్వామిగా కొలిచేవారు. ఇప్పటికీ కూడా సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి విగ్రహం సగభాగం నీటిలో మునిగి ఉంటుంది. ఆ బావిలో నీటినే అక్కడ అర్చకులు భక్తులకు తీర్ధంగా అందిస్తారు. ఎంత తవ్వినా స్వామివారి తుది మాత్రం ఇప్పటికీ ఎవ్వరు కనుగొన లేకపోయారు. #🌅శుభోదయం #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🌷బుధవారం స్పెషల్ విషెస్ #🙏దేవాలయాల్లో గణపతి ఉత్సవం #🛕కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి🙏
24 likes
32 shares
विघ्नहर्ता श्री गणेश ॐ श्री गणेशाय नमो नमः!! 🌷🌷ఈ సంకట నాశన గణేశ స్తోత్రం ప్రతీరోజూ పఠిస్తే శ్రీ గణేశుని అనుగ్రహం వలన అన్ని సంకటాలు తొలగిపోతాయి🌷🌷. మనం ఏ కార్యం తలపెట్టినా, అది ఎటువంటి అవరోధాలు కలుగకుండా, విజయవంతంగా కొనసాగాలని ప్రప్రథమంగా శ్రీ విఘ్నేశ్వరుని ప్రార్ధిస్తాము. సకల సంకటాలనూ తొలగించే గణపతి అనుగ్రహం కోసం సంకట నాశన గణేశ స్తోత్రం భక్తి శ్రద్ధ విశ్వాసాలతో పఠిస్తే, శ్రీ గణేశ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఎవరికి వారు స్వయంగా, అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. ప్రతీరోజూ ఈ మహామహిమాన్వితమైన స్తోత్రాన్ని పఠించి, గణేశ అనుగ్రహం పొందుదాం. 🌺🙏సంకటనాశన గణేశస్తోత్రమ్🌺🙏 నారద ఉవాచ :🌸🌸 ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్, భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్, తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్. లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ, సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్. నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్, ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్. ద్వాదశ ఈతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః, న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికారకం ప్రభో ! విద్యార్థీ లభతే విద్యాం, దనార్థీ లభతే ధనమ్, పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్. జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్, సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్, తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశన గణేశస్తోత్రం సంపూర్ణమ్. ఓం గం గణపతయే నమః .#🌅శుభోదయం #🌷గురువారం స్పెషల్ విషెస్ #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🙏శ్రీ వరసిద్ధి వినాయక స్వామి🕉️ #🛕కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి🙏
29 likes
18 shares
🌺 కాణిపాకం 🌺 ఒక గ్రామంలో అంగవైకల్యంతో ముగ్గురు సోదరులు ఉండేవారు. వారిలో ఒకరికి చెవి, మరొకరికి నోరు, ఇంకొకరికి కళ్ళు పనిచేయవు. వారు కష్టపడి పనిచేసి ఒక భూమిని సాగు చేసుకుంటున్నారు. ఒక బావిలో నీరు వ్యవసాయ పనులకు వాడుకునే వారు. బావి క్రమంగా ఎండిపోవడంతో దానిని తవ్వే ప్రయత్నం చేశారు. తవ్వడం మొదలు పెట్టిన కొంత సేపట్లోనే వారికి బావిలో ఏదో వున్నట్ల నిపించింది. ఇంకాస్త తవ్వేలోగా అక్కడ నుంచి రక్తం ఏరులై పారి బావి అంతటా నిండి పోయింది. ఆశ్చర్యపోయి చూసిన అన్నదమ్ములకి అందులో నుంచి ఒక వినాయకుడి విగ్రహం కనిపించింది. స్వయంగా అక్కడ వెలిసిన వినాయకుడు ఆ ముగ్గురి అంగవైకల్యాన్ని తొలగించాడు. ఈ విషయం తెలిసిన గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయి, దేవునికి పూజలు చేయడం మొదలుపెట్టారు. ప్రజలందరూ వినాయకుడు స్వయంగా వెలిశాడని స్వయంభు వినాయక స్వామి అని అంటారు. దేవుడికి ఆలయం నిర్మించి కాణిపాకం వినాయక స్వామిగా కొలిచేవారు. ఇప్పటికీ కూడా సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి విగ్రహం సగభాగం నీటిలో మునిగి ఉంటుంది. ఆ బావిలో నీటినే అక్కడ అర్చకులు భక్తులకు తీర్ధంగా అందిస్తారు. ఎంత తవ్వినా స్వామివారి తుది మాత్రం ఇప్పటికీ ఎవ్వరు కనుగొన లేకపోయారు... #☀️శుభ మధ్యాహ్నం #🌷బుధవారం స్పెషల్ విషెస్ #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🙏దేవాలయాల్లో గణపతి ఉత్సవం #🛕కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి🙏
16 likes
2 shares