మార్గశిర మాసం ప్రాశస్త్యం 🕉️ విశిష్ట పండుగల మాసం 🪔మహావిష్ణు ప్రీతికరంమైన మార్గశిర మాసం మోక్షదాయిని
22 Posts • 2K views
మార్గశిర మాసం ♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️ వేదములలో సామవేదమును, రుద్రులలో శంకరుడను, చందస్సులో గాయత్రిని, మాసాలలో మార్గశీర్షమాసాన్ని అన్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. మహాభారతకాలంలో మాసములు మార్గశీర్షముతో ఆరంభమవుతూ ఉండేవి. కనుక మాసములలో మార్గశీర్షము మొదటిది. అట్లే ఈమాసములో ఆచరించబడు ఉపవాసాది వ్రతములన్నియు మహాఫలమును ఇచ్చునవిగా శాస్త్రములయందు చెప్పబడినది. శుక్లే మార్గశిరే పక్షే యోషిత్ భర్తురనుజ్ఞయా! ఆరభేత వ్రతమిదం, సార్వకామిక మాదతః!! వివాహిత యువతి క్రొత్తగా కాపురమునకు వచ్చిన పిమ్మట వచ్చు మొదటి మార్గశిరమాసమునందలి శుక్లపక్షమున పతియనుమతితో ’పుంసవన వ్రతము’ను ఆచరింపవలెను. అది సమస్త మనోరథములను తీర్చును అని భాగవతమునందు చెప్పబడినది. ఈమాసమునందే క్రొత్తగా ఇంటికి వచ్చిన పంటను భగవదర్పణము కావింతురు. దీనినే ’అన్నయజ్ఞము’ అందురు. వాల్మీకి రామాయణమునందు ఈ మార్గశిర మాసము మాస శిరోభూషణముగాను, ఆ సంవత్సరమునకే అలంకార ప్రాయముగాను చెప్పబడినది. అంతేకాక కలువపూలతో శివుని అర్చించిన అది మహాఫలమునొసగును. ఈమాసములో ఒకపూట భుజించి, తనశక్తిని అనుసరించి బ్రాహ్మణులకు భోజనం పెట్టినవాడు వ్యాధులనుండి, పాపాలనుండి విముక్తినందగలడు. సర్వకళ్యాణ సంపూర్ణుడై, అన్నిరకాల ఓషధులను పొందగలడు. ఈమాసములో ఉపవసించినవాడు మరుసటి జన్మలో వ్యాధి రహితుడు, బలశాలి కాగలడు. వ్యవసాయంలో భాగస్వామియై బహుధనధాన్య సంపన్నుడు అవుతాడు. ఈమాసములో రోజంతా ఉపవాసముండి కేశవుని అర్చిస్తే అశ్వమేధయాగ ఫలితాన్ని పొందవచ్చు. ఆవ్రతశీలుని పాపం కూడా నశిస్తుంది. ఈవిధముగా ఇతరమాసములకంటె మార్గశిరమునందు అనేక విశిష్ట లక్షణములు గలవు. కనుక భగవానుడు దీనిని తన స్వరూపముగా తెల్పెను. ♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️ *మార్గశిర మాసం* తెలుగు మాసాల్లో ఒక్కోదానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది. అలాగే మార్గశిర మాసం కూడా చాలా ప్రత్యేకమైనది. అయితే ఈ మాసాన్ని.. అన్ని మాసాల్లోనే అగ్రగణ్యమైనదిగా పురాణాలు చెప్తున్నాయి. మరి ఈ మాసామే ఎందుకు అంత విలక్షణమైనదో? మార్గశిర మాసాన్నే ‘మార్గశీర్షం’ అని కూడా వ్యవహరిస్తారు. శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం. మాసాల్లోకెల్లా అగ్రగణ్యమైనది కాబట్టి మార్గశిరానికి ఈ పేరు వచ్చింది. ఈ విషయాన్నే తేటతెల్లం చేసేలా మాసాలలో తానే మార్గశిరమని అర్జునునికి గీతాచార్యుడు విభూతి యోగంలో తేటతెల్లం చేశాడు. అర్జునునితో కృష్ణపరమాత్మ తాను ‘వేదానాం సామవేదోస్మి దేవానాం వాసవః’అంటే ‘ఇంద్రుడు’ అని చెబుతూనే….. తాను ‘మాసానాం మార్గశీర్షోహం’ అని ప్రకటించాడు. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. సూర్యభగవానుడు.. దేవగురువు అయిన బృహస్పతికి సంబంధించినటువంటి ధనూరాశిలో సంచరించే పుణ్యకాలాన్నే మార్గశిరము అంటారు. హేమంత ఋతువులో వచ్చే మొదటి నెల. దీనినే జ్యోతిష్యాన్ని అనుసరించి సౌరమాన ప్రకారం ధనుర్మాసమని, చంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అంటారు. ఆధ్యాత్మికం గా ప్రసిద్దమైన ఈ మాసం ప్రకృతి లో కూడా సౌందర్యాన్ని, శాంతిని సంతరిస్తుంది. మృగశిర నక్షత్రం లో కూడిన పూర్ణిమ వచ్చిన కారణం గా ఈ మాసానికి మార్గశీర్ష మాసమని పేరు. శ్రీ కృష్ణ పరమాత్ముడు మార్గశిర మాసం స్వయంగా ఆయనే అని తెలియజేశాడు. ఈ మాసం లో చేసే ఏ పూజైనా, హోమమైనా, అభిషేకమైనా ఎటువంటి దైవకార్యం చేసినా దానిని స్వయం గా తనే స్వీకరిస్తానని తెలియచేసాడు. చంద్రుడు మనః కారకుడు, ఆ చంద్రుడు అనుకూలంగా లేకపోతే, మంచి ఆలోచనలు కలగవు, మానసిక స్థితి సరైనమార్గంలో ఉండదు. అందుకని చంద్రుడు అనుకూలించే కాలం లో మన దైవపూజలని ప్రారంభిస్తే వాటి మీద శ్రద్ధ బాగా పెరిగి తద్వారా మనోధైర్యం వృద్దిచెందుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుని కి ఉచ్ఛ స్థానం వృషభ రాశి, మృగశిర నక్షత్రం వృషభరాశి కి చెందినది కావున, చంద్రుని సంపూర్ణ అనుగ్రహం ఉండి దైవ కార్యాలని చేసే కొద్దీ చేయాలనిపించే మంచి ఆలోచనలు కలుగుతాయి. ‘రుతూనాంకుసుమాంకం' అనే శ్లోకంలో మార్గశీర్షాన్ని నేనే, ఆరు రుతువులలో పుష్ష సౌరభం నేనే, సామవేదానికి చెందిన గానాలలో బృహత్సామాన్ని నేనే, ఛందస్సులో గాయత్రీ ఛందాన్ని నేనే, శోభ అధికంగా ఉండే వసంతకాలాన్ని నేనే అని భగవద్గీతలోని విభూతి యోగంలో ఆ క్రిష్ణభగవానుడే వివరించాడు. మొత్తానికి మార్గశిరం అంటే నేనేనని చెప్పుకున్న మాసమన్నమాట. ఉత్తమమైనవి అనగా పక్షులలో గరుత్మంతుడు, మృగాలలో సింహము, నెలలో మార్గశిర మాసం, వేదాలలో సామవేదం ఎంతో ఉత్తమమైనవని భగవద్గీతలో సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే తెలిపారు. ఇది ప్రకృతి కాంతకు సీమంతం. తుషార బిందువుల హేమంతం. ఈకాలంలో పొలాలనుంచి ధాన్యం ఇళ్లకు చేరి ప్రజలు సంతోషంగా ఉంటారని ఉత్తమ మాసంగా పరిగణిస్తారు. మార్గశిరం ఆధ్యాత్మిక భావ వికాసానికి ప్రతీక. కార్తీకంలో పుణ్యనదీ స్నానాలతో తరించిన భక్తుల హృదయాలు మార్గశిర మాసంలో మరింత భగవచ్చింతనలో తన్మయమవుతాయి. నిర్మలమైన ఆకాశం మాదిరిగా మనస్సులు కూడా ఈ మాసంలో నిర్మలంగా ఉంటాయి. ఏడాదిలో వచ్చే ఇరవైనాలుగు ఏకాదశి తిథుల్లో ప్రతిదీ పవిత్రమైనదైనా.. వీటన్నింటిల్లో వైకుంఠ ఏకాదశి మాత్రం ఉండదు. ఎందుకంటే అన్ని ఏకాదశుల్నీ చంద్రమానం ప్రకారం గణిస్తే... వాటికి భిన్నంగా వైకుంఠ ఏకాదశిని సౌరమానం ప్రకారం గణిస్తారు. సూర్యుడు ఉత్తరాయనానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. ‘వైకుంఠ ఏకాదశి’, ‘ముక్కోటి ఏకాదశి’, ‘స్వర్గద్వార ఏకాదశి’, ‘మోక్ష ఏకాదశి’ అంటూ పిలిచే ఈ ఏకాదశి రోజునే శ్రీమహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠంలోని వాకిళ్లు తెరుచుకుంటాయని అంటారు. దక్షిణాయనంలో యోగనిద్రలోకి వెళ్లిన నారాయణుడు కార్తిక శుద్ధ ఏకాదశిరోజున మేల్కొంటాడు. అలా మేల్కొన్న స్వామిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలూ మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి రోజున వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణుడిని దర్శించుకుంటే స్వర్గలోకప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే... మార్గశిర శుద్ధ ఏకాదశి భగవద్గీత లోకానికి అందిన రోజు కూడా. ఇంతటి పవిత్రమైన మార్గశిర మాసంలో చేసేటటువంటి ఏ పూజ అయినా, ఏ అభిషేకాలు అయినా, ఏ హోమమైనా తానే స్వీకరిస్తానని ఆ విష్ణుభగవానుడు తెలియజేశాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రునికి ఉచ్ఛ స్థానం వృషభ రాశి మృగశిర నక్షత్రం కావటంవల్ల మనం ఎటువంటి కార్యక్రమాలు చేయాలని తలపెట్టిన ఆ చంద్రుని సంపూర్ణ అనుగ్రహం ఉండి ఆ కార్యాలను నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు కోరలు తెరుచుకొని ఉంటాడు, ఈ రోజుల్ని యమదంష్ట్రలుగా చెబుతారు. మార్గశిర పౌర్ణమి తో అనేక రకమైన వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి, కనుక కృతజ్ఞత పూర్వకంగా ఈ దినం.. యమధర్మ రాజుని ఆరాధిస్తారు. ఈ పౌర్ణమి ని కోరల పున్నమి, నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు. మార్గశిరం..ఆధ్యాత్మిక భావ వికాసానికి ప్రతీక. కార్తీకంలో పుణ్యనదీ స్నానాలతో తరించిన భక్తుల హృదయాలు.. మార్గశిర మాసంలో మరింత భగవచ్చింతనలో తన్మయమవుతాయి.. నిర్మలమైన ఆకాశం మాదిరిగా మనస్సులు కూడా ఈ మాసంలో నిర్మలంగా ఉంటాయి. తూర్పు తెలతెల వారుతుండగా..పొగమంచు ఇంకా విచ్చిపోకముందే ముంగిట రకరకాల ముగ్గులు.. వరిపిండితోనూ .. సున్నపుపిండితోనూ వేసి.. వాటి మధ్య బంతిపూలు తురిమిన గొబ్బిళ్లు పెట్టే ఆడపిల్లలు.. తెలుగు పల్లెటూళ్ల ధనుర్మాస శోభకు వన్నెలు.. చేకూరుస్తారు.✍️ ఓంనమోభగవతే వాసుదేవాయ నమః ``` *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు* 🌷🙏🌷``` 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏``` #మార్గశిర మాసం ప్రాశస్త్యం 🕉️ విశిష్ట పండుగల మాసం 🪔మహావిష్ణు ప్రీతికరంమైన మార్గశిర మాసం మోక్షదాయిని #మోక్షానికి మార్గం మార్గశిర మాసం #ముక్తికి మార్గం మార్గశిర మాసం #🙏🕉️మార్గశిర మాసం విశిష్టత☪️✍️🥰 #🙏🕉️శ్రీ మహావిష్ణువు🕉️🙏
17 likes
10 shares
*🙏నేటినుండి మార్గశిర మాసం-విశిష్టత🙏* 🌺\|/హిందూ సాంప్రదాయాల ప్రకారం.. తెలుగు నెలల్లోని ప్రతి ఒక్క నెలకు ఒక్కో ప్రత్యేకత ఉంది. అయితే అన్ని మాసాలన్నింటిలోనూ మార్గశిర మాసానికి ఎంతో విశిష్టత.. ప్రత్యేకత ఉంది.🌺 🌺\|/మార్గశిర మాసాన్నే 'మార్గశీర్షం' అని కూడా పిలుస్తారు. శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం. మాసాలన్నింటిలో అగ్రగణ్యమైనది కాబట్టే దీనికి ఈ పేరు వచ్చింది. అంతేకాదు మార్గశీర్షం ఒక విలక్షణమైన మాసం. అంటే మార్గాలలో శ్రేష్టమైనది. అది ఏ మార్గం అంటే భగవంతుని అనుగ్రహం పొందు భక్తి మార్గం.శ్రీమహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం మార్గశిరం. ఇదే విషయాన్ని 'గీత'లో శ్రీ కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. 🌺\|/వేదములలో సామవేదమును, రుద్రులలో శంకరుడను, చందస్సులో గాయత్రిని, మాసాలలో మార్గశీర్షమాసాన్ని అన్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. మహాభారతకాలంలో మాసములు మార్గశీర్షముతో ఆరంభమవుతూ ఉండేవి. కనుక మాసములలో మార్గశీర్షము మొదటిది. అట్లే ఈమాసములో ఆచరించబడు ఉపవాసాది వ్రతములన్నియు మహాఫలమును ఇచ్చునవిగా శాస్త్రములయందు చెప్పబడినది. 🌺\|/వివాహిత యువతి క్రొత్తగా కాపురమునకు వచ్చిన పిమ్మట వచ్చు మొదటి మార్గశిరమాసమునందలి శుక్లపక్షమున పతియనుమతితో ’పుంసవన వ్రతము’ను ఆచరింపవలెను. అది సమస్త మనోరథములను తీర్చును అని భాగవతమునందు చెప్పబడినది. ఈమాసమునందే క్రొత్తగా ఇంటికి వచ్చిన పంటను భగవదర్పణము కావింతురు. దీనినే ’అన్నయజ్ఞము’ అందురు. వాల్మీకి రామాయణమునందు ఈ మార్గశిర మాసము మాస శిరోభూషణముగాను, ఆ సంవత్సరమునకే అలంకార ప్రాయముగాను చెప్పబడినది. 🌺\|/ఈ సందర్భంగా ఈ మాసం యొక్క విశేషాలు, ప్రాముఖ్యత, విశిష్టతతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.🌺 *🌺\|/మార్గశిరం అంటే\|/🌺* *🌺\|/‘బృహత్సామ తథాసామ్నాం - గాయత్రీ ఛందసా మహం మహం - మాసానాం మార్గశీర్షోహ-రుతూనాంకుసుమాంకం'* అనే శ్లోకంలో మార్గశీర్షాన్ని నేనే, ఆరు రుతువులలో పుష్ష సౌరభం నేనే, సామవేదానికి చెందిన గానాలలో బృహత్సామాన్ని నేనే, ఛందస్సులో గాయత్రీ ఛందాన్ని నేనే, శోభ అధికంగా ఉండే వసంతకాలాన్ని నేనే అని భగవద్గీతలోని విభూతి యోగంలో ఆ కృష్ణభగవానుడే వివరించాడు. మొత్తానికి మార్గశిరంఅంటే నేనేనని చెప్పుకున్న మాసమన్నమాట.🌺 *🌺\|/మాస సంక్రమణం\|/🌺* 🌺\|/సూర్య భగవానుడు 12 నెలల్లో అంటే ఒక్కో నెలకు ఒక్కో రాశి చొప్పున మారుతూ ఉంటాడు. ఇలా మారుతూ ఉండడాన్ని ‘మాస సంక్రమణం' అంటారు. ఇలా ఒక ఏడాది 12 సంక్రమణలు వస్తాయి. సూర్యుడు తులరాశి నుండి వ్రుశ్చికరాశిలోకి ఆగమనం చేయడాన్ని వ్రుశ్చిక సంక్రమణం అంటారు. ఈ మార్గశిర మాసం మహాలక్ష్మీదేవికి, మహావిష్ణువుకు, సూర్యదేవునికి ఎంతో ప్రీతికరమైనది🌺. *🌺\|/భగవద్గీత’ జననం\|/🌺* 🌺\|/హిందువులందరికీ ‘భగవద్గీత' జన్మించిన మాసంగా పరిగణించే పవిత్రమైన మాసం. ఈ మాసమంతా శ్రీమహావిష్ణువును తులసీదళంతో పూజిస్తే పుణ్యం దక్కుతుందని.. పండితులు చెబుతుంటారు. శుక్ల పక్ష ద్వాదశినాడు పంచామ్రుతాలతో అభిషేకం చేయాలి. 🌺\|/శ్రీమహా విష్ణువుతో పాటు సూర్యభగవానుడిని పూజించి.. ఈ మాసంలో ఏ పని చేస్తున్నా *‘ఓం దామోదరయ నమః,* *ఓం నమో నారాయణయ నమః'* అనే మంత్రాలను జపించాలని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ప్రతిరోజూ బ్రహ్మముహుర్తంలో తులసి సన్నిధిలోని మట్టి, ఆకులను తీసుకుని *‘ఓం నమో నారాయణాయ'* అనే మంత్రాన్ని స్తుత్తిస్తూ శరీరానికి రాసుకుని స్నానం చేయాలి.🌺 *🌺\|/మార్గశిర లక్ష్మీవార వ్రతం\|/🌺* 🌺\|/మార్గశిర మాసంలోని గురువారాల్లో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తూ.. ‘మార్గశిర లక్ష్మీవార వ్రతం' చేయడంతో పాటు, ద్వాదశ అభిషేకం వల్ల మీ కుటుంబంలో అందరి ఆయురారోగ్యాలు మెరుగుపడతాయి. ఈ మాసంలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఇదే సమయంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి ‘మదుసూదనుడు' అనే నామంతో శ్రీమహా విష్ణువును ఆరాధించాలి.🌺 *🌺\|/మోక్షం తథ్యం\|/🌺* 🌺\|/మార్గశిర మాసం ఎన్నో పర్వాలకు నెలవుగా పరిగణిస్తారు.మార్గశిర మాసంలో ధనుర్మాసం వచ్చినట్లు ఐతే మార్గశిర శుద్ధ ఏకాదశిని ‘వైకుంఠ ఏకాదశి' అని ..దీనినే ‘మోక్ష ఏకాదశి' అనీ అంటారు. ఈ పర్వదినాన వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం నుండి వెళ్లి దేవున్ని దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని చాలా మంది భక్తుల నమ్మకం. ఈ ఏకాదశి నాడే గీతా జయంతి, సమస్త మానవాళికి ధర్మభాండాగారం అయిన భగవద్గీతను క్రిష్ణుడు ప్రబోధించిన రోజు. ఇలా ఎన్నో విశిష్టతలతో భక్తులందరికీ హర్షం ఇచ్చేదే మార్గ శీర్ష మాసం.🌺 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 #🙏🕉️మార్గశిర మాసం విశిష్టత☪️✍️🥰 #ముక్తికి మార్గం మార్గశిర మాసం #మోక్షానికి మార్గం మార్గశిర మాసం #మార్గశిర మాసం ప్రాశస్త్యం 🕉️ విశిష్ట పండుగల మాసం 🪔మహావిష్ణు ప్రీతికరంమైన మార్గశిర మాసం మోక్షదాయిని
15 likes
12 shares
S.HariBlr (Bangalore)
1K views 3 days ago
#😇My Status #భక్తి స్పెషల్ #మార్గశిర మాసం ప్రాశస్త్యం 🕉️ విశిష్ట పండుగల మాసం 🪔మహావిష్ణు ప్రీతికరంమైన మార్గశిర మాసం మోక్షదాయిని *పర్వదినాల మాసం మార్గశిరం* *మృగశిర నక్ష త్రంతో కూడిన పౌర్ణమి గల మాసం మార్గశిరం. హేమంత రుతువులో తొలి మాసం. శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలోని విభూతి యోగంలో ‘మాసానాం మార్గశీర్షీహం' అని మాసాలలో తాను మార్గశీర్షాన్ని అని తెలిపాడు. ఆ విధంగా ఈ మాసం భగవత్స్వరూపమే. ఇది ఆధ్యాత్మిక సాధనకు అనువైనది, శైవ, వైష్ణవానుయాయులకు విశిష్టమైనదిగా చెబుతారు. కార్తిక మాసం వలెనే ఈ మాసంలో కూడా శైవ వైష్ణవ సంబంధితమైన పండగలు, పర్వాలు మెండుగా ఉన్నాయి.* *మార్గశిరమాసం ప్రధానంగా శ్రీమహావిష్ణువు నిత్యానుపాయిని, సిరిసంపదలనిచ్చే సిరుల తల్లికి ప్రియమైనది. ఈ నెలలోని గురువారాలు (లక్ష్మీవారాలు) ఆ తల్లికి అత్యంతప్రియమైనవి. ఈ రోజుల్లో చేసే గురువార నోములు తెలుగు లోగిళ్లలో ముత్తయిదువలు విధిగా ఆచరిస్తారు. ఈ వ్రత మాహాత్మ్యాన్ని గురించి శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు, ద్రౌపది మార్గశిర వ్రతాన్ని ఆచరించినట్లు పురాణ కథనం.* *ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో స్వయంభువుగా వెలసిన శ్రీకనకమహాలక్ష్మికి మార్గశిర మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలు, జిల్లాల నుంచి ఎంతో మంది భక్తులు ఈ ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించి, ఆరాధిస్తారు.* *మార్గశిర మాసంలో తొలి తిథి నుంచి అన్నీ పర్వదినాలే!* *శుక్లపాడ్యమి* *ఈ మాసంలోని శుక్ల పాడ్యమి ప్రాధాన్యత ఏమంటే బ్రహ్మ నుంచి యుక్తిగా వేదాలను తస్కరించిన మధుకైటభులను విష్ణువు సంహరించి వాటిని తిరిగి బ్రహ్మ దేవునికి అందజేసినది ఈనాడేనని చెబుతారు. ఆ రోజు నుంచే కొంత కాలం తర్వాత తిరిగి వేదాధ్యయనం ప్రారంభమయిందని పురాణ వచనం.* *విదియ తదియలు* *ఈ మాసంలోని శుక్ల విదియ తదియల్లో ఉమామహేశ్వర వ్రతం చేయా లని 'చతుర్వర్గ చింతామణి' గ్రంథం ఉటంకిస్తోంది. ఈ వ్రతం వల్ల అప మృత్యు నివారణ జరుగుతుంది. స్త్రీలకు ఐదవతనం వృద్ది చెందుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తప్పక వీక్షించడానికి ఫేస్బుక్ పై డైలీ విష్ పేజీని ఫాలో అవ్వండి.* *పంచమి* *నాగారాధన పర్వం. నాగుల చవితి, నాగ పంచమినాడు పుట్టల్లో పాలుపోసి నాగమయ్యను ఆరాధించనివారు ఈ రోజు నాగపూజను చేయా లని 'స్మృతి కౌస్తుభం' అంటోంది. ఇంటిలోనే పూజా మందిరంలో నాగ ప్రతిమనుగాని, అది లేకపోతే గోడపై నాగుపాము చిత్రాన్ని పసుపుతో చిత్రించి, పంచామృతాలతో, సుగంధ పుష్పాలతో పూజించాలి.* *షష్ఠి* *ఈ షష్ఠినే స్కంద షష్ఠి అని సుబ్రహ్మణ్య షష్టి అని పిలుస్తారు. సుబ్రహ్మణ్యుని కుండలినీ శక్తికి ప్రతీకగా సర్ప రూపంలో పూజిస్తా రన్నది తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో నాగుల చవితి రోజు మాదిరి పుట్టలో పాలు పోసి నాగేంద్రుని ఆరాధిస్తారు. సంతానం కోరేవారు శిలపై సర్ప రూపాన్ని చెక్కించి వేప, రావి చెట్ల మొదట్లో ప్రతిష్ఠించి పూజ నిర్వ హిస్తారు. తమిళనాడులో కుమారస్వామికి విశేష పూజలు నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాలలో మోపిదేవితో సహా పలు దేవాలయాల్లో సుబ్రహ్మణ్యుని ఆరాధన ఘనంగా నిర్వహిస్తారు.* *సప్తమి* *దీనినే నందా సప్తమిగా వ్యవహరిస్తారు. ఈ రోజున సూర్యారాధన చేయాలని భవిష్య పురాణం అంటున్నది. సూర్యారాధన వల్లఆరోగ్యం చేకూరుతుంది.* *అష్టమి* *ఈ తిథి కాలభైరవాష్టమి. శివునిచే సృష్టించబడిన కాలభైరవుడు బ్రహ్మ శిరస్సులలో ఒకదానిని ఖండించడంతో ఆయన చతుర్ముఖుడయ్యాడు. అంతవరకూ బ్రహ్మకు ఐదు శిరస్సులుండేవని చెబుతారు. శిరసు తుంచిన కాల భైరవునికి అంత తీవ్రతలేని బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంది. బ్రహ్మ శిరస్సును బదరీనాథ్ వద్ద గంగ ఒడ్డున ప్రతిష్టించిస్నానం చేస్తే ఆ పాపం పోతుందనడంతో ఆ ప్రకారమే చేసి దాని నుంచి విముక్తుడయ్యాడు. అయితే బ్రహ్మ తలను ఖండించమన్న ఆజ్ఞను కూడా ఏమాత్రం తడబాటులేక వెంటనే శిరసావహించి నెరవేర్చినందుకు శివుడు కాలభైరవుని క్షేత్రపాలకునిగా నియమించి ఆ క్షేత్రాన్ని దర్శించేవారు ముందుగా కాలభైరవుని దర్శించి తరువాతే తనను దర్శించాలని, ఆ విధంగా చేసిన వారికే ముక్తి లభిస్తుందని వరమిచ్చాడు.* *ఏకాదశి* *మార్గశిరంలో అతి ముఖ్యమైన పర్వం. ఈ రోజును వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని వ్యవహరిస్తారు. ఆ రోజున శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై ఉత్తర ద్వారానికి వేంచేస్తాడు. ఆ సమయం కోసం ముక్కోటి దేవతలు నిరీక్షిస్తారు. భూలోకంలో దేవతలతో బాటు మానవులు కూడా దర్శించి మోక్షగాములవుతారు. అందుకే ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు ఉపవాసం ఉండి స్వామిని సేవిస్తే మోక్షం లభిస్తుందని, ఇలా ఏకాదశి వ్రతంచేయడం వల్ల ముక్తి కలుగుతుందని పద్మపురాణం పేర్కొంటోంది. మరొక విశేషమేమంటే ఆ రోజే శ్రీకృష్ణపరమాత్మ అర్జునునికి గీతోపదేశం చేశాడు. అందువల్ల ఆ రోజు గీతా జయంతిగా ప్రాధాన్యం పొందింది. ఈ రోజున వ్యష్టిగా, సమిష్టిగా భక్తులు భగవద్గీతను పూజించి గీతా పారాయణం చేస్తారు. భగవంతునితో సమా నంగా భక్తి గ్రంథాన్ని పూజించడం విశేషం. మిగతా మత గ్రంథాలకు లేని ఈ విశిష్టత కలిగిన పవిత్ర గ్రంథం భగవద్గీత. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తప్పక వీక్షించడానికి ఫేస్బుక్ పై డైలీ విష్ పేజీని ఫాలో అవ్వండి.* *ద్వాదశి* *నాడు హనుమంతుని షోడషోపచారాలతో పూజిస్తే విద్యాభివృద్ధి, యశస్సు, ఐశ్వర్యం, వాక్శుద్ధి కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున హనుమద్ర్వతం ఆచరించాలని వ్రత గ్రంథాలంటున్నాయి.* *చతుర్దశి* *చతుర్దశి దత్త జయంతి. అత్రి అనసూయ దంపతులకు త్రిమూర్తుల అంశతో ఈరోజు దత్తుడు జన్మించాడు. శ్రీహరి ఆ బాలుని దత్తునిగా స్వీకరిం చాడు. అందువల్ల దత్తుడని, అత్రి మహాముని కుమారుడవటం వల్ల దత్తాత్రేయడని పిలుస్తారు. అధ్యాత్మ, యోగ విద్యలకు ఒజ్జబంతి దత్తాత్రేయుని పూజించడం వల్ల జ్ఞానం, ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఈ రోజు గురు చరిత్ర పఠనం శ్రేయోదాయకం. కొందరు పౌర్ణమినాడు దత్త జయంతి జరపడం కద్దు.* *బహుళ పాడ్యమి* *దశావతారాలలో ఒకటైన పరశురామావతారం ఆవిర్భవించిన రోజు మార్గశిర బహుళ పాడ్యమి. జమదగ్ని, రేణుక దంపతులకు ఆయన జన్మించిన రోజు. పాలకుల నుంచి బాధలు పడుతున్న ప్రజలను రక్షించడానికి 21 సార్లు క్షత్రియ సంహారం చేసినవాడే పరశురాముడు. మహావీరుడు, విలువిద్యలో ఆరితేరినవాడు.* *అమావాస్య* *మార్గశిర అమావాస్య దక్షుని పుత్రుడైన విశ్వకర్మ జయంతి. శివుని వల్లఎన్నో వరాలు పొంది శిల్పులు, స్వర్ణకారులు యంత్రాలు నడిపే కార్మికులకు, చేనేత పనివారికి, స్థపతులకు పూజనీయుడయ్యాడు.* *ఈ మాసంలో ప్రధానమైనది ధనుర్మాసవత్రం. వృశ్చిక రాశి నుంచి ధను రాశిలోనికి రవి ప్రవేశించే నెల రోజుల కాలం ధనుర్మాసం. నెల రోజుల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ధనుర్మాసంలో ప్రతి రోజు వేకువనే ఆచరిస్తారు. ప్రధానంగా వైష్ణవులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రీరంగనాథుని అర్చించిన గోదాదేవి నాడు ద్వాపరంలో కృష్ణుడు గోపికల చేత చేయించిన కాత్యాయినీ వ్రతం వలె కావేరీ నదీ తీరంలో వ్రతమాచరించి రంగనాథుని పొందింది. గోదాదేవి శ్రీరంగనాథుని కీర్తిస్తూ రోజుకొక పాశురం (పాట) పల్లవించింది. ఆ ముప్పై పాశురాలు 'తిరుప్పావై'గా 'నాలాయిరం' అనే గ్రంథంలో చోటు చేసుకున్నాయి. భక్తి తత్త్వం, తాత్త్విక చింతన, ఉపనిష త్సారంతోబాటు ఛందోబద్దమైన ఈ పాశురాలు తమిళ వాఙ్మయంలో మకుటాయమానమైనవి. విష్ణ్వాలయాల్లో ధనుర్మాసమంతా సుప్రభాతానికి బదులు 'తిరుప్పావై' గానం చేస్తారంటే ఈ పాశురాలకు గల ప్రాముఖ్యత ఎటువంటిదో అవగతమవుతుంది. అలాగే శివాలయాల్లో నాయనార్లు రచంచిన 'తిరువెంబావై' (శివుని కీర్తిస్తూ పాడిన పాటలు)ని సుప్రభాత సమయాలలో ప్రత్యేకంగా గానం చేస్తారు. ధనుర్మాసంలో పండుగలు పర్వాలతో పాటు సంక్రాంతి కళ చోటు చేసుకుంటుంది. భోగి పండగ వరకూ సాగే ధనుర్మాసాన్ని సంక్రాంతి సంబరాలకు అంకురార్పణగా భావించడం సముచితం. మార్గశిరాన్ని మోక్షగామిగా భావించడంలో అతిశయోక్తి లేదు.* ❀꧁హరేకృష్ణ꧂❀ 🍁🔔🍁 🙏🕉️🙏 🍁🔔🍁
11 likes
15 shares