🕉️శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు🙏
6 Posts • 326 views
PSV APPARAO
859 views 6 days ago
#తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS #తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వైభవం🕉️ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు చూద్దాం రారండి 🙏 #🕉️శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు🙏 #🕉️శ్రీవారి బ్రహ్మోత్సవాలు🚩🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 *బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం* ఓ బ్రహ్మా! నాకు ఉత్సవాన్ని జరిపించమని స్వామి కోరగా బ్రహ్మ ఆయన ఆజ్ఞను అనుసరించి స్వయంగా ఉత్సవాన్ని జరిపించాడు. కన్యారాశిలో సూర్యుడు ప్రవేశించిన అనంతరం చిత్తా నక్షత్రంలో 'ధ్వజారోహణం', ఉత్తరాషాఢ నక్షత్రం నాడు 'రథోత్సవం', శ్రవణం నాడు 'చక్రస్నానం', ఇలా బ్రహ్మదేవుడే స్వయంగా ప్రారంభించి జరిపిన ఉత్సవం అయినందున దీనిని "బ్రహ్మోత్సవం” అని అంటారు. పరబ్రహ్మకు చేసిన ఉత్సవం కూడా అయినందున దీనిని 'బ్రహ్మోత్సవం' అని అంటారు. _ధ్వజారోహణం_ అంకురారోపణ జరిగిన తర్వాత రోజు ఉదయం జరిగే ఉత్సవం 'ధ్వజారోహణ' ఉత్సవం. అనగా గరుడ ధ్వజాన్ని పైకెగరేస్తారు. ఈ ధ్వజారోహణకు ముందు ముద్గా న్నం అనగా పెసరపప్పుతో చేసిన పులగాన్ని (పొంగలి) గరుడునికి నివేదన చేస్తారు. ధ్వజంపై నిలిచిన గరుడుడు శ్రీవారి బ్రహ్మోత్సవానికి రావాల్సిందిగా భక్తులందరినీ ఆహ్వానిస్తాడు. ఈ గరుడుడే సకల దోషాలను, పాపాలను అపవిత్రతను తన దృష్టితో ఎనిమిది యోజనాల దూరం అనగా 96 కిలోమీటర్ల దూరం వరకు తొలగిస్తాడు. _పెద్దశేష వాహనం_ ధ్వజారోహణం జరిగిన నాటి సాయంత్రం మలయప్ప స్వామిని పెద్ద శేష వాహనంపై నాలుగు మాడ వీధులలో అంగరంగ వైభవంగా సకల పరిజన పరి చందంగా తాళ, నృత్య, వాద్య, సంగీత, గానసంరంభంతో, వేదపండితుల వేదఘోష లతో, దివ్య ప్రబంధ అధ్యాపకుల ప్రబందాధ్యాయముతో పాటు భక్తుల కోలాహలం మధ్యన స్వామి ఊరేగుతారు. పెద్దశేష వాహనం అనగా ఆదిశేషుడే. ఆదిశేషుడనగా ఆది- మొదటి, శేషుడు-సేవకుడు అనగా మొదటి సేవకుడు అని అర్థం. శ్రీమన్నారాయణునికి నిరంతరం వెంట ఉండి అతనికి కావాల్సిన అన్ని సేవలు అన్నీ తానే అయ్యి చేస్తాడు ఆదిశేషుడు. స్వామి నివసించడానికి తానే ఇల్లుగా, పడుకోవడానికి శయ్యగా, కూర్చోవడానికి సింహాసనంగా, నడవడానికి పాదుకలుగా, తలకింద తలగడగా, చలివేస్తే దుప్పటిగా, వర్షం, ఎండ వస్తే గొడుగుగా ఇలా స్వామికి ఎప్పుడు ఏ సేవ కావాలన్నా తానే ఆ పరికరంగా మారి సేవ చేస్తాడు కావున 'ఆదిశేషుడు' అని పిలువబడతాడు. అందుకే మొదటి వాహన భాగ్యం ఆదిశేషుడికే స్వామి కల్పించాడు. ఈ విధంగా సేవలు చేయ డమే కాకుండా స్వామి ఏ రూపంలో ఉన్నా తాను కూడా అతనికి తగిన రూపంలో ఉంటూ వెంట అవతరిస్తాడు. ఆదిశేషుడు తన వేయి శిరములలో ఒక శిరములోని ఒక చిన్న భాగంలో అఖి లాండ కోటి బ్రహ్మాండములను సిద్ధార్థ (ఆవగింజ) రూపంలో ధరిస్తాడు. ఇంత బ్రహ్మాండాన్ని ఒక ఆవగింజలా ధరించే మహాబలుడు ఆదిశేషుడు. అతనికి కాస్త తల భారంగా అనిపించినపుడు అనగా భూమిపై నివసించే ప్రాణులు సహించరాని పాపా లను చేసినప్పుడు పాపాల భారం మోయలేనని కొంచెం తల కదలిస్తాడు. ఏప్రాంతంలో ఆదిశేషుని తల కదిలితే ఆ ప్రాంతంలో భూకంపం సంభవిస్తుంది. ఈ విధంగా ఆది శేషుడు మొదట సకల జగత్తుకు ఆధారం. శ్రీమన్నారాయణుడు రాముడిగా అవత రించినప్పుడు ఆదిశేషుడు లక్ష్మణస్వామిగా వచ్చాడు. తమ్ముడిగా సేవ చేసిన ఫలితంగా కృష్ణావతారంలో అన్నగా అవతరించమని ఆదేశిస్తే కృష్ణునికి అన్నగా బలరామునిగా అవతరించాడు. కలియుగంలో వ్యాకరణ శాస్త్రం తెలియక అంటే మాట్లాడలేక ఇబ్బం దిపడుతున్న జనుల కోసం పాణిని మహర్షి రచించిన 'అష్టాధ్యాయి' సూత్రాలకు వ్యాఖ్యానం చేయడానికి 'పతంజలి'గా అవతరించి మహాభాష్యం రాసి వాక్ శుద్ధిని చేశాడు. ఈ పతంజలే యోగ భాష్యం రాసి మనఃశుద్ధిని, వైద్యశాస్త్రంలో భాష్యం రాసి శరీర శుద్ధిని చేశారు. తరువాత చాలా కాలానికి భగవద్రామానుజులుగా అవతరించి బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం చేసి 'శ్రీభాష్యం' అను పేరుతో అందించారు. ఇంతటి దివ్యమైన సేవ చేసిన మహానుభావుడు అయినందున మలయప్ప స్వామి మొదటి వాహన సేవా భాగ్యాన్ని ఆదిశేషునికి ఇచ్చారు. _చిన్న శేష వాహనం_ ధ్వజారోహణం తెల్లవారి ఉదయం మలయప్ప స్వామి చిన్న శేష వాహనం పై నాలుగు మాడ వీధులలో విహరిస్తారు. చిన్న శేషుడు అనగా శేషుని తమ్ముడు వాసుకి. ఈ వాసుకి శ్రీమన్నారాయణుని ఆజ్ఞతో క్షీరసాగర మధన సమయంలో మందర పర్వ తానికి కవ్వపు తాడుగా మారి సముద్రాన్ని చిలకడానికి సహాయం చేశాడు. స్వామి ఆజ్ఞతో తన పడగల నుండి అనగా ముఖముల నుండి విషజ్వాలలు చిమ్ముతూ రాక్షసు లను మూర్ఛాక్రాంతులను చేశాడు. తన విషాన్ని సముద్రంలో ఉద్గారం(వాంతి) చేసి సముద్రంలో హాలాహలం పుట్టడానికి తన వంతు సేవ చేసి ఆ హాలహలాన్ని పానం చేసి లోకాలను రక్షించే అవకాశాన్ని శంకరునికి ఇచ్చి దానికి కృతజ్ఞతగా శంకరుని చేతికి కంకణమైనాడు. తన చెల్లెలైనా 'జగత్కారు' ని 'జగత్కారు' అనే మహర్షికి ఇచ్చి వివాహం చేసి బ్రహ్మ ఆజ్ఞను పాటించి ఆ దంపతుల సంతానమైన ఆస్తికునితో జనమేజయుడు ఆచరించిన సర్పయాగాన్ని నివారించి అఖిల నాగులకు జీవితాన్ని ప్రసాదించిన మహానుభావుడు 'వాసుకి', అందుకే మలయప్ప స్వామి వాసుకికి రెండవ సేవా భాగ్యాన్ని ప్రసాదించాడు. _హంసవాహనం_ చిన్న శేషవాహన సేవ జరిగిన నాటి సాయంత్రం మలయప్ప స్వామి హంస వాహ నం పై విహరిస్తారు. శ్వేత వర్ణంతో పాలని, నీటిని వేరు చేయగల ఏకైక పక్షి 'హంస' కావున దీనిని జ్ఞానానికి ప్రతీకగా వ్యవహరిస్తారు. అంటే మంచిచెడులేవో తెలిపి దేనిని ఆచరించాలో తెలియజేసే దానిని జ్ఞానం అంటారు. జ్ఞానాన్ని స్వీకరించి అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి. పాలను స్వీకరించి నీటిని విడిచిపెట్టాలి. జ్ఞానాన్ని ప్రభోదించే సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులను పరమహంసలు అంటారు. ఒకసారి బ్రహ్మలోకంలో ఋషులందరూ ఎవరు కనబడినా మీరెవరు? అని అడుగుతారని ఇచ్చట మీరు అన్నదానికి అర్థం ఏమిటని బ్రహ్మను ప్రశ్నించారు. శరీరాన్ని ఉద్దేశించా లేక ఆత్మనా. ఒకవేళ శరీరమే అయితే ఏ రూపమో ప్రత్యక్షంగా కనబడుతోంది కదా. ఆత్మ స్వరూపం ఒక్కటే కావున ఆత్మను ఎవరని అడగడం కుదరదు అయినందున మీరెవరు అనే ప్రశ్న తప్పు కదా అని బుషులు బ్రహ్మను ప్రశ్నించారు. సమాధానం ఎలా ఇవ్వాలో తెలియక బ్రహ్మ శ్రీమన్నారాయణునిస్మరిం చగా వారికి తత్త్వాన్ని తెలుపడానికి స్వామి ఒక హంస రూపంలో వారి ముందుకు వచ్చారు. హఠాత్తుగా వచ్చిన హంసను చూసిన ఋషులు మీరెవరని అడుగగా హంస గా కనబడుతున్నాను కదా లోపల ఉన్న ఆత్మ మీలో ఉన్నదాని వంటిదే కదా మరి మీరె వరు అని మీరే ఎలా అడిగారు అని హంసరూపంలో ఉన్న స్వామి తిరిగి ప్రశ్నించారు. ఇదంతా చూసిన ఋషులు వచ్చింది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అనుకొని సాష్టాం గ దండ ప్రణామం చేసి చేతులు జోడించి స్వామీ! మా సందేహాన్ని తొలగించండని ప్రార్థించారు. నేను మనిషిని, నేను పశువును, నేను రాక్షసుడిని అని చెబితే అవన్నీ శరీరాలు, నేను అంటే శరీరం కాదు కదా. శరీరమే ఆత్మ అనుకున్న వారే నేను మనిషిని అంటారు. కాని ఆత్మజ్ఞానం ఉన్నవారు భగవంతుడు ఆత్మగా ఉన్నా, జీవాత్మ ఆత్మగా ఉన్నా మానవ శరీరాన్ని అని చెప్పాలి, వీరే ఆత్మజ్ఞానులు, మీరెవరు అన్న ప్రశ్నకు ఆత్మ జ్ఞానం ఉన్న వారా లేనివారా అని అర్థం. ఇలా ఆత్మ, అనాత్మ వివేకాన్ని క్షీరనీర న్యాయంతో తొలగించిన అవతారం హంసా వతారం. అందుకే మనలోని అహంకారాన్ని తొలగించి ఆత్మ వివే కాన్ని కలిగించాలనే అనుగ్రహ బుద్ధితో స్వామి హంసను తన వాహనంగా చేసుకొని ఆత్మను శరీరం మోయటం లేదు. ఆత్మే శరీరాన్ని మోస్తుందని తెలియ జేస్తున్నాడు. పరమాత్మ జీవాత్మకు ఆధారం. అదే విధంగా జీవాత్మ శరీరానికి ఆధారం, ఈ ఆత్మను తాను స్వయంగా మోసుకొని తన లోకానికి చేర్చేవాడు పరమాత్మ అన్న ధర్మ సూక్ష్మాన్ని బోధించడమే హంస వాహనంలోని ఆంతర్య మని స్వామి స్వయంగా హంస వాహనం పై విహరిస్తూ బోధిస్తాడు. *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
22 likes
9 shares
PSV APPARAO
681 views 6 days ago
#తిరుమల వైభవం - శ్రీవారి బ్రహ్మోత్సవాలు - ధ్వజారోహణం🕉️🙏 #తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వైభవం🕉️ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు చూద్దాం రారండి 🙏 #🕉️శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు🙏 #తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS #🕉️శ్రీవారి బ్రహ్మోత్సవాలు🚩🙏 🔔 *తిరుమల వైభవం* 🔔 🙏 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల అంకురార్పణ 🙏 🌹 తిరుమల, సెప్టెంబర్ 23, 2025: తిరుమల శ్రీవారి ఆలయంలో రేపటినుంచి (సెప్టెంబర్ 24) అక్టోబర్ 2 వరకు జరగబోయే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించబడింది. ఈ సందర్భంగా స్వామివారి తరపున సేనాధిపతి శ్రీ విష్వక్సేనులు నాలుగు మాడ వీధుల్లో ఊరేగి, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు చేసి, పుట్టమన్నులో న‌వధాన్యాలను నాటుతూ వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ కార్యక్రమం పూర్తి చేశారు. 🌸 ✨ అంకురార్పణ విశిష్టత ✨ 🌿 వైఖానస ఆగమంలో అంకురార్పణకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. 🌿 విత్తనాల మొలకెత్తడం శుభప్రతీకం. 🌿 ఉత్సవాలు విజయవంతంగా సాగాలని సంకల్పించడంతో పాటు, స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. 🌙 సూర్యాస్తమయం తరువాతే… 🌹 జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడిని సస్యకారకుడు అంటారు. అందుకే పగటివేళ విత్తనాలు నాటరాదు. 🌹 సూర్యాస్తమయం అనంతరం శుభముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. 🌹 ఈ వేళ నాటిన విత్తనాలు బాగా మొలకెత్తుతాయి, దాంతో ఉత్సవాలు సాఫల్యంగా జరుగుతాయని విశ్వాసం. 🙏 అంకురార్పణ క్రమం 🙏 🌸 మధ్యాహ్నం విత్తనాలను నీటిలో నానబెట్టడం. 🌸 యాగశాలను ఆవుపేడతో అలంకరించడం, బ్రహ్మపీఠం ఏర్పాటుచేయడం. 🌸 అగ్నికుండం ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఈశాన, జయ దేవతలను ఆహ్వానించడం. 🌸 భూమాతను ప్రార్థిస్తూ పాలికల్లో మట్టిని నింపి, చంద్రుని ప్రార్థిస్తూ విత్తనాలు చల్లడం. 🌸 పాలికలకు నూతన వస్త్రాలతో అలంకారం చేసి పుణ్యాహవచనం చేయడం. 🌸 సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పారాయణం. 🌸 ప్రతిరోజూ పాలికల్లో నీరు పోస్తూ వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల మధ్య కార్యక్రమం కొనసాగుతుంది. 🌹 ఈ పవిత్ర ఘట్టంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 🌹 🙏 స్వామివారి ఆశీస్సులు భక్తులందరిపై కురవాలని కోరుకుందాం 🙏 https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
11 likes
7 shares
PSV APPARAO
750 views 9 days ago
#శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు #తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS #తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వైభవం🕉️ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు చూద్దాం రారండి 🙏 #🕉️శ్రీవారి బ్రహ్మోత్సవాలు🚩🙏 #🕉️శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు🙏 👆 *శ్రీవారి బ్రహ్మోత్సవాలకు స్మూక్ష–క్షేత్రస్థాయిలో ప్రణాళికలు* *భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి* *టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్* తిరుమల, 2025 సెప్టెంబర్ 19: తిరుమల పవిత్రత కాపాడటమే కాకుండా సాధారణ భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడం ముఖ్య లక్ష్యంగా పని చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు స్మూక్ష్మ, క్షేత్రస్థాయి ప్రణాళికలు రూపొందించి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్ లో ఆయన టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, టీటీడీ వివిధ విభాగాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను వివరించారు. *సమావేశంలోని ముఖ్యాంశాలు:* • 2025 సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి. • జిల్లా పాలన, పోలీసులతో కలిసి సూక్ష్మ- క్షేత్రస్థాయి ప్రణాళికలు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పాల్గొనగలిగేలా సమన్వయంతో ఏర్పాట్లు. • ఇప్పటికే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఆభరణాల శుభ్రత, వాహనాల ట్రయల్ రన్ పూర్తి. • ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు. సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు గరుడసేవ. • ధ్వజారోహణం రోజు (సెప్టెంబర్ 24) రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పణ. సెప్టెంబర్ 25న పిఏసి-5ను ప్రారంభం. • సివిల్ ఇంజినీరింగ్ పనులకు రూ.9.50 కోట్లు, విద్యుద్దీపాలంకరణకు రూ.5.50 కోట్లు కేటాయింపు. దాతల విరాళాల ద్వారా రూ.3.50 కోట్లతో పుష్పాలంకరణ. • పుష్పాలంకరణకు 60 టన్నుల పుష్పాలు వినియోగం. • బ్రహ్మోత్సవ రోజుల్లో సిఫార్సు లేఖల ద్వారా గదుల కేటాయింపులు రద్దు. ఈ సమయంలో 3500 గదులు ఆఫ్‌లైన్‌లో సాధారణ భక్తులకు మాత్రమే కేటాయింపు. • భక్తులు వాహన సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించేందుకు ఈ ఏడాది 36 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు. • 1.16 లక్షల ప్రత్యేక దర్శన టికెట్లు, రోజూ 25 వేల SSD టోకెన్లు (గరుడసేవ మినహా) విడుదల. అన్ని ప్రివిలేజ్ దర్శనాలు రద్దు. వీఐపీ బ్రేక్ దర్శనం స్వయంగా విచ్చేసే ప్రోటోకాల్ ప్రముఖులకే పరిమితం. • రోజూ 8 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్. • 20 హెల్ప్ డెస్కులు ఏర్పాటు. ప్రతి గ్యాలరీలో భక్తుల అభిప్రాయాలను సేకరించేందుకు శ్రీవారి సేవకులు ప్రత్యేకంగా నియామకం. • గరుడసేవ రోజున భక్తులకు 14 రకాల వంటకాలు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కేంద్రంలో రోజూ ఉదయం 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాద వితరణ. • తిరుమలలో 24 ప్రాంతాల్లో సుమారు 4000 వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు. • తిరుపతిలో అలిపిరి లింక్ బస్‌స్టాండ్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, ఇస్కాన్ గ్రౌండ్, ఎస్వీ మెడికల్ కాలేజ్ గ్రౌండ్, భారతీయ విద్యాభవన్ గ్రౌండ్, దేవలోక్, AP టూరిజం ఓపెన్ ఏరియాల్లో మొత్తం 5250 ద్విచక్ర వాహనాలకు, 2700 కార్లకు పార్కింగ్ స్థలం కేటాయింపు. • పార్కింగ్ ప్రదేశాల నుండి తిరుమలకు ఆర్టీసీ బస్సులు. సాధారణ రోజుల్లో ఆర్టీసీ బస్సుల ద్వారా 1900 ట్రిప్పులు, గరుడసేవ రోజున 3200 ట్రిప్పులు తిరిగేందుకు ఏర్పాట్లు. • 2000 మంది టీటీడీ భద్రతా సిబ్బంది, 4700 పోలీసు సిబ్బంది, 450 సీనియర్ అధికారులు విధులు. • 3500 మంది శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు సేవలు. • 3000 సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం. • పారిశుద్ధ్యం కోసం 2300 సిబ్బందితో పాటు, 960 మంది అదనపు సిబ్బంది నియామకం. • కల్యాణకట్టలో భక్తుల తలనీలాల సమర్పణకు అందుబాటులో 1150 మంది క్షురకులు. • గతంలో ఎన్నడూ లేని విధంగా 28 రాష్ట్రాల నుండి వచ్చిన 298 బృందాల ప్రదర్శనలు. • గరుడసేవ రోజున 20 రాష్ట్రాల నుండి వచ్చిన 37 బృందాలు సంప్రదాయ, ఆధ్యాత్మిక కళారూపాల ప్రదర్శన. • భక్తులకు వైద్య సేవలు అందించేందుకు 60 డాక్టర్లు, 60 మంది పారా మెడికల్ సిబ్బంది. • అత్యవసర వైద్య సేవలు అందించేందుకు 14 అంబులెన్స్ లు ఏర్పాటు. ఈ సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు, తిరుపతి మున్సిపల్ కమిషనర్ శ్రీమతి మౌర్య, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు, సిఈ శ్రీ సత్య నారాయణ, తిరుమల ఏఎస్పీ శ్రీ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
11 likes
15 shares