★ బత్తుల ప్రవీణ్ కుమార్ గారిని వరించిన జాతీయ ఉత్తమ సేవారత్న అవార్డు
★ తిరుపతిలో ఘన సత్కారం
మన బాధ్యత ఫౌండేషన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు బత్తుల ప్రవీణ్ కుమార్ గారు చేస్తున్న నిస్వార్ధ సమాజ సేవకు గాను తిరుపతికి చెందిన శ్రీపతి చారిటబుల్ ట్రస్ట్ వారు శుక్రవారం తిరుపతిలో ఆయనకు జాతీయ ఉత్తమ సేవా రత్న అవార్డును అందించి పెద్దల సమక్షంలో ఘనంగా సన్మానించారు...
ఈ సందర్భంగా బత్తుల ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ మన బాధ్యత ఫౌండేషన్ ద్వారా రక్తదానం, పర్యావరణ పరిరక్షణ, రోడ్డు భద్రత, విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, పేదవారికి సహాయం మొదలైన సేవా, అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నాము అని తెలిపారు... అందుకు గాను ఈరోజు అవార్డు రావడం సంతోషంగా ఉంది అని, నిరంతరం మంచిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం అని, ప్రజలు అందరూ సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేసారు...
ఈ కార్యక్రమంలో పలువురు స్వచ్చంద సంస్థల అధ్యక్షులు, సోషల్ ఆర్గనైజర్స్, యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు... #✌️నేటి నా స్టేటస్