• రూ. 1 లక్ష కోట్లతో రాయలసీమను ఉద్యాన హబ్ గా తయారు చేస్తాం.
• రూ.30 వేల కోట్ల మేర ప్రభుత్వ నిధులు... రూ.70 వేల కోట్లు ప్రైవేటు పెట్టుబడులతో సీమలో హర్టీకల్చర్ అభివృద్ధి చేస్తాం.
• ప్రస్తుతం ఏడాదికి 400 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఫలాల ఉత్పత్తి జరుగుతోంది.
• భవిష్యత్తులో 1000 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులకు కేంద్ర స్థానంగా రాయలసీమ ఎదుగుతుంది.
• అక్వా కల్చర్ గత పాలనలో ఒడిదుడుకులు ఎదుర్కోంది.
• రూ.1.50 యూనిట్ చొప్పున విద్యుత్ ను ఆక్వాకు ఇస్తున్నాం.
• ప్రపంచంలోనే అత్యుత్తమ ఆక్వాకల్చర్ హబ్ గా మన ప్రాంతం తయారవుతుంది.
• ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లో డబ్బులు చెల్లించింది కూడా కూటమి ప్రభుత్వమే.
• కోకోనట్, కోకో, కాఫీ లాంటి పంటలపై కేంద్రం దృష్టి సారించింది.
• దీనిపై మరింత శ్రద్ధపెట్టి వ్యాల్యూ అడిషన్ చేసేలా చర్యలు తీసుకుంటాం.
• ఏపీలో రైతుల ఆత్మహత్యలను నివారించేలా చర్యలు చేపడుతున్నాం. ప్రతీ ఘటననూ ఆడిట్ చేయిస్తాం.
• విద్యార్ధులు కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు ఎదుర్కోవాలి.
• ఆత్మహత్యలు దేనికీ పరిష్కారం కాదని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
• లాజిస్టిక్స్ రంగంలో పెనుమార్పులు సాధించేలా నిర్ణయం తీసుకుంటున్నాం.
• రైల్వే రంగంలో రూ.3 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
• రెండేళ్లలో ఇచ్చాపురం నుంచి దిగువ వరకూ నాలుగు లేన్ల ట్రాక్ వచ్చే అవకాశం ఉంది.
• తద్వారా కార్గో, ప్రయాణికుల మార్గాలు విస్తృతం అవుతాయి.
• జాతీయ రహదారులు కూడా పెద్దఎత్తున నిర్మించేలా కేంద్రం ప్రాజెక్టులు ప్రతిపాదించింది.
• డబుల్ ఇంజన్ సర్కారులో త్రిబుల్ ఫలితాలు వచ్చేలా ప్రయత్నాలు చేస్తు్న్నాం.
• గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులను రూ.4 వేల కోట్లతో అనుసంధానిస్తున్నారు. #📰ఈరోజు అప్డేట్స్ #🏛️పొలిటికల్ అప్డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్డేట్స్📢 #🏛️రాజకీయాలు