వయసు 80 ఏళ్లు.. పరిగెత్తితే పతకం పక్కా!
AP: నెల్లూరు జిల్లా కావలికి చెందిన 80 ఏళ్ల రామసుబ్బమ్మ నేటి తరానికి ఆదర్శం. పేదరికం, కుటుంబ బాధ్యతల వల్ల ఆగిపోయిన తన పరుగును ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టారు. యువతులతో సైతం పోటీపడి ఏకంగా 32 బంగారు పతకాలు సాధించి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఓటమికి కుంగిపోయే నేటి తరానికి ఆమె ఒక గొప్ప స్ఫూర్తి. 'లక్ష్యసాధన కోసం ఆమె చేసిన కఠోర శ్రమకు శిరసు వంచి నమస్కరిస్తున్నా' అంటూ మంత్రి లోకేశ్ అవ్వను అభినందించారు #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్