ShareChat
click to see wallet page

*అయ్యప్పను ఆకట్టుకున్న కడియపులంక పూల మాల* *గజరాజుపై ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణ* శబరిమలైలో జరిగిన అయ్యప్ప స్వామి ఆరాట్టు కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక శ్రీ రామాంజనేయ ఫ్లవర్ మర్చంట్ యజమాని, జనసేన పార్టీ నాయకుడు ఆకుల భాస్కరరావు తీసుకెళ్ళిన పూల మాలను స్వామి వారికి అలంకరించారు.గజరాజు పై స్వామి వారి గ్రామోత్సవంలో ఈ పూలమాల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ప్రతి ఏటా ఆయన స్వామి వారి పుట్టిన రోజు ఆరాట్టు మహోత్సవంకు శబరిమల వెళతారు. ఈ ఏడాది కూడా ఆరుగురు అయ్యప్ప భక్తులతో కలిసి బుధవారం ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ వేడుకలకు ప్రత్యేకంగా క్రిసంతం తెలుపు,పచ్చని పూలతో తయారు చేయించి తీసుకెళ్లిన ఫూల మాల శబరిమల ఆలయ పూజారులను విశేషంగా ఆకట్టుకోవడంతో స్వామి వారికి అలంకరించారు.స్వామి వారి పద్దెనిమిది మెట్లు నుంచి పంబ గణపతి వరకూ వచ్చినప్పుడు, వెళ్లినప్పుడు కూడా ఈ గ్రామోత్సవంలో ఇదే మాలను స్వామి వారికి అలంకరించడం విశేషం.మీడియా, సోషల్ మీడియా ద్వారా ఆ వీడియోలు విశ్వవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. స్వామి వారి గ్రామోత్సవంలో తాము తీసుకెళ్లిన కడియపులంక పూల మాలను అలంకరించడం ఎంతో ఆనందంగా ఉందని భాస్కరరావు తెలిపారు. :- #😃మంచి మాటలు #🌼బ్యూటిఫుల్ Flowers #😇My Status #🎋మా పల్లె అందాలు #🌲పచ్చని చెట్లు🌲

719 వీక్షించారు
11 రోజుల క్రితం