ShareChat
click to see wallet page

టీనేజ్ పిల్ల‌ల‌తో ప‌రుగుపందెంలో పోటీప‌డిన ఓల్డేజ్ గ్రాండ్ మా `ఐ యామ్ ఫ‌స్ట్..32 గోల్డ్‌..14 సిల్వ‌ర్ ` అంటూ విజ‌య‌గ‌ర్వంతో ప్ర‌క‌టిస్తోన్న నెల్లూరు జిల్లా కావ‌లికి చెందిన‌ 80 ఏళ్ల రామ‌సుబ్బ‌మ్మ గారి క‌థ‌నాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన బీబీసీ తెలుగు వారికి అభినంద‌న‌లు. ప‌రీక్ష ఫెయిల‌య్యామ‌ని, టాప్ ర్యాంక్ రాలేద‌ని, క్రీడ‌ల్లో ప‌త‌కాలు సాధించ‌లేక‌పోయామ‌ని నిరుత్సాహప‌డే నేటి త‌రం బామ్మ గారిని ఆద‌ర్శంగా తీసుకోవాలి. ఆమె క్రీడాస్ఫూర్తి, ల‌క్ష్య‌సాధ‌న కోసం చేసిన కఠోర శ్ర‌మకు శిర‌సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను.  చిన్న‌పిల్ల వ‌య‌స్సులో ఆట‌లు ఆడేది, పేద‌రికం అడ్డంకిగా మారింది. పెళ్ల‌య్యింది. పిల్ల‌లు, కుటుంబ‌బాధ్య‌త‌ల‌తో ప‌రుగు ఆగిపోయింది. ఇళ్ల‌ల్లో ప‌నిచేసి కుటుంబాన్ని పోషించింది. చ‌దువు విలువ తెలిసిన త‌ల్లి చొర‌వ‌తో పిల్ల‌లు సెటిల‌య్యారు. త‌న క‌ల‌ను సాకారం చేసుకునేందుకు అడుగులు వేసింది. చిన్న‌ప్పుడు ఆగిపోయిన ప‌రుగును వృద్ధురాల‌య్యాక‌ ఆరంభించింది. మ‌న‌స్సులోని సంక‌ల్పానికి  80 ఏళ్ల వ‌య‌స్సు అడ్డుకాలేదు. బాలిక‌ల‌తోనూ ప‌రుగుపందెంలో పాల్గొని ప‌త‌కాలు సాధిస్తోంది. యంగ్ అండ్ డైన‌మిక్ అథ్లెట్ రామ‌సుబ్బ‌మ్మ గారికి హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు. జాతీయ ప‌రుగు పందెంలో పోటీప‌డాల‌నుకుంటున్న బామ్మ గారికి మ‌న‌వ‌డు లోకేష్ అండ‌గా నిలుస్తాడు. ఏ సాయం కావాల‌న్నా అందిస్తాడు. ర‌న్ గ్రాండ్ మా..ర‌న్‌... Video Source: BBC News Telugu #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

580 ने देखा
4 दिन पहले