ShareChat
click to see wallet page

Da y 1️⃣ భగవద్గీత📕 మొదటి అద్యాయం📖 అర్జున విషాద యోగము💭 47 శ్లోకాలలో 1 వ శ్లోకము *ధృతరాష్ట్ర ఉవాచ । ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః । మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ।। అనువాదం:-ఈ శ్లోకం భగవద్గీతకు నాంది పలికే సందర్భం.ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు మాత్రమే కాదు, విపరీతమైన పుత్రవాత్సల్యం వల్ల ధర్మాధర్మాల విచక్షణ కోల్పోయినవాడు.ధృతరాష్ట్రుడు తన సారథి అయిన సంజయుడితో "ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం కోసం చేరిన నా కుమారులు, పాండవులు ఏమి చేశారు?" అని ఆత్రుతగా అడుగుతాడు. ఇక్కడ పాండవులను తన బిడ్డలుగా కాకుండా వేరుగా చూస్తూ, తన కొడుకులను మాత్రమే 'నా వాళ్ళు' (మామకాః) అని పిలవడం అతనిలోని స్వార్థాన్ని, పుత్రవ్యామోహాన్ని స్పష్టంగా బయటపెడుతుంది. ఆ పవిత్ర భూమి ప్రభావం వల్ల తన కొడుకుల మనసు మారి యుద్ధం ఆపేస్తారేమోనని లేదా ధర్మం ఉన్న పాండవులకే విజయం దక్కుతుందేమోనని భయపడుతున్నాడు .ఈ 'నా వారు-పరాయి వారు' అనే బేధభావమే యుద్ధానికి మరియు మనిషి పతనానికి అసలు కారణం. . . . @Surendra_Sanatani Do Subscribe & Follow✅ For Spiritual Information 🕉 Sanatana Dharma🚩 #🙏🏻కృష్ణుడి భజనలు #✌️నేటి నా స్టేటస్ #🌅శుభోదయం #🎶భక్తి పాటలు🔱 #📙ఆధ్యాత్మిక మాటలు Bhagavadgita, Gita, kurukshetra,mahabharatham, krishna, motivation, explore, newpost, sharechat trending, viral,

1.2K ने देखा
1 दिन पहले