#📰ఈరోజు అప్డేట్స్
నరసన్నపేట: సత్యవరం పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణ
నరసన్నపేట మండలం సత్యవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం పౌష్టికాహార ఫుడ్ ఫెస్టివల్ను సందడిగా నిర్వహించారు. విద్యార్థులు తప్పనిసరిగా పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులు తమ ఇళ్లలో తయారుచేసిన ఆహారాన్ని, మరికొందరు పాఠశాలలోనే తయారుచేసి ప్రదర్శనలో ఉంచారు. ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.