ShareChat
click to see wallet page

#🧐ఆసక్తికరమైన పోస్ట్💥👌 తేదీ : 22-01-2026 గురువారం రాజమండ్రి కంబాల చెరువు నుండి క్వారీ మార్కెట్ కి వెళ్లే కోరుకొండ రోడ్ మురుగు నీటితో నిండిపోవడంతో వాహనదారులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు... ఈ సందర్భంగా మన బాధ్యత ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గారా అజయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలు డ్రైనేజిలను కేవలం మురుగు నీరు పారడానికి మాత్రమే వినియోగించాలి అని, వాటిలో నిర్లక్ష్యంగా చెత్తను వేయడం వల్ల డ్రైనేజిలు బ్లాక్ అయి నీరు రోడ్డుపై చేరుతుంది అని తెలిపారు... ప్రాంతం ఏదైనా ప్రతీ ఒక్కరూ వ్యర్ధాలను డస్ట్ బిన్ లో మాత్రమే వేయాలి అని తెలిపారు... షాపులు, తోపుడు బండ్ల వ్యాపారస్తులు ఖచ్చితంగా డస్ట్ బిన్ లు ఏర్పాటు చేయాలని కోరారు... ప్రతీ ఒక్కరూ పారిశుధ్య కార్మికుల కష్టాలను తెలుసుకుని వారికి సహకరించాలని తెలిపారు... మన నిర్లక్ష్యంతో మనకే నష్టం అని గుర్తిద్దాం...

535 ने देखा