పక్షి పిల్లకు 50 మంది సెక్యూరిటీ.. స్పెషాలిటీ ఇదే
అరుదైన 'గ్రేట్ ఇండియన్ బస్టర్డ్' పక్షి ఇటీవల గుజరాత్లోని కచ్లో ఓ పిల్లను పొదిగింది. ప్రస్తుతం ఈ పక్షులు 150 మాత్రమే ఉన్నట్లు అంచనా. అందుకే ఆ పక్షి పిల్లను 50 మంది అధికారులు 24/7 సంరక్షిస్తున్నారు. 1 మీటర్ ఎత్తు, 15-18KGల బరువు పెరిగే ఈ పక్షులు రాజస్థాన్, గుజరాత్ అడవుల్లో ఉంటాయి. పర్యావరణ మార్పులు, విద్యుత్ తీగల కారణంగా అంతరించే దశలో ఉండటంతో వాటిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నారు. #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్