#😰ఆలయంలో తొక్కిసలాట..8 మంది మహిళలు దుర్మరణం!
శ్రీకాకుళం ముద్దుబిడ్డ, వాగ్ధాటిలో దిట్ట అయిన ధర్మాన ప్రసాదరావు గారు మరోసారి తన మార్కు ‘అతిథి మర్యాద’తో వార్తల్లో నిలిచారు. మూలపేట సభలో ఆయన చేసిన ప్రసంగం చూస్తుంటే, ప్రజల మీద ఆయనకు ఉన్నది కేవలం ప్రేమ మాత్రమే కాదు, వారి కడుపు నింపాలనే అచంచలమైన పట్టుదల అని కూడా అర్థమవుతోంది!
సభలో జనం పలచబడటం చూసి, ఆ మండుతున్న ఎండలో ఆయన కనులు ఎర్రబడ్డాయి, కడుపు మండింది. వెంటనే ధర్మాన గారు మైక్ పట్టుకుని ఒక పదునైన అస్త్రాన్ని ప్రయోగించారు; అదే— ‘భోజన అస్త్రం’.
'మీటింగ్ అవ్వకముందే మీరు అక్కడికి వెళ్లినా, మీకు ఎవరూ ఒక్క ముద్ద కూడా పెట్టరు; మేము వద్దని ఆదేశించాం' అంటూ ఆయన హెచ్చరించారు. సాధారణంగా సభకు ముందే మద్యం ఇస్తే వస్తామని చెప్పి, అది పుచ్చుకుని వచ్చిన వారు కూడా ఆయన సుదీర్ఘ ప్రసంగాన్ని భరించలేక, 'పెడితే పెట్టారు లేదంటే లేదు' అని వెనుదిరిగారు. ప్రజలను భిక్షగాళ్లలా భావిస్తే, ఈ కాలంలో ఎవరూ ఆత్మగౌరవాన్ని చంపుకోరని వారు నిరూపించారు. దాంతో చేసేది లేక, వచ్చే సభలకు జనం రారనే భయంతో నిర్వాహకులు చివరికి భోజనాలు వడ్డించక తప్పలేదు.
#🔵వైయస్ఆర్సీపీ #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్డేట్స్