కన్యాదాతలుగా మారిన జవాన్లు
తండ్రిని కోల్పోయిన యువతి వివాహంలో జవాన్లే పెళ్లి పెద్దలుగా మారిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. UPలోని బాగ్పత్కు చెందిన సైనికుడు హరేంద్ర సింగ్ 2020లో ప్రమాదంలో చనిపోగా ఆయన కుమార్తె వివాహానికి తోటి జవాన్లు తరలివచ్చారు. స్వయంగా కన్యాదానం చేసి ఆమెకు రూ.6.10 లక్షల కానుకను అందించి అండగా నిలిచారు. వీడ్కోలు వేడుక వరకు తోడుగా ఉండి సైనిక బంధం అంటే రక్తసంబంధం కంటే మిన్న అని నిరూపించారు. #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్