పల్నాడు జిల్లా:
వినుకొండ
సీఎం వినుకొండ పర్యటనకు సర్వం సిద్ధం స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్రలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు ముఖ్యనాయకులు కార్యకర్తలతో సమావేశం మధ్యాహ్నం 12:30 గంటలకు వినుకొండకు రాక సాయంత్రం 5:45 గంటలకు తిరుగు పయనం..
పల్నాడు జిల్లా వినుకొండ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం వినుకొండ నియోకవర్గంలో పర్యటించనున్నారు.
ముఖ్యమంత్రి పర్యటనకు వినుకొండ పట్టణంలో సర్వం సిద్ధమైంది.
నాలుగవసారి ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి సీఎం చంద్రబాబు వినుకొండలో పర్యటించనుండటంతో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసన సభ్యులు జీవీ ఆంజనేయులు, జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా, జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు, ఇతర అధికారులు సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
మధ్నాహం 12:40 గంలకు సీఎం చంద్రబాబు వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైనదానంలో హెలీపాడ్ వద్దకు చేరుకుంటారు.
అక్కడ నుండి రోడ్డు మార్గంలో పట్టణంలోని ఎన్ ఎస్ పి మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజావేదికకు చేరుకుంటారు.
ప్రజా వేదికలో ప్రజలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించనున్నారు స్వచ్ఛరత్నం స్టాల్స్ ను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 3:05 గంటల నుండి 4:35 గంటల వరకు ప్రజావేదిక సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో పార్టీ ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం పాల్గొంటారు.
అనంతరం వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సీఎం చంద్రబాబు నాయుడు సందర్శిస్తారు ఆసుపత్రిలో బయోమెడికల్ వ్యర్ధాల నిర్వహణపై సమీక్షిస్తారు.
అనంతరం తిరిగి జూనియర్ కాలేజీ క్రీడా మైదానంలోని హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు.
సాయంత్రం 5:45 గంటలకు సీఎం చంద్రబాబు వినుకొండ నుండి ఉండవల్లిలోని తన నివాసానికి బయలు దేరి వెళతారు.
సీఎం పర్యటనను దృష్టిలో ఉంచుకొని అధికార యంత్రాంగం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయం తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. #🆕Current అప్డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్