ShareChat
click to see wallet page

🚨 అల్వాల్‌లో విషాద ఘటన 🚨 పెంపుడు పిల్లి విషయమై ఇంట్లో జరిగిన వాగ్వాదం కారణంగా ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన చోటుచేసుకుంది. అల్వాల్ పరిధిలోని రిసాలాబజార్ శివమన్ ప్రైడ్ అపార్ట్మెంట్‌లో నివసిస్తున్న అముదల కుసుమలత కుమార్తె ప్రిన్సీ శ్రేష్ట (23), ఎంబీబీఎస్ చదువుతోంది. ఇంట్లో పిల్లి విషయమై తల్లి–కుమార్తె మధ్య వాగ్వాదం జరగడంతో, శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రేష్ట చున్నీతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 📢 మరిన్ని తాజా వార్తల కోసం Follow | Like | Share & Subscribe చేయండి. 📞 9666033449 #HyderabadNews #Alwal #BreakingNews #TeluguNews ##RAJHన్యూస్

18.6K వీక్షించారు
1 నెలల క్రితం