#🌾మన ఊరి పంటలు *పండ్లను కడగకుండా తినేస్తున్నారా? ఇది చూడండి!*
ముంబైలో ఎలుకలు పండ్లను తినకుండా కాపాడేందుకు వ్యాపారులు 'రాటోల్' అనే మందును పూయడం కలకలం రేపింది. ఆ వీడియో వైరల్ కావడంతో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. 'రాటోల్'లో ఎల్లో ఫాస్పరస్, జింక్ ఫాస్ఫైడ్ లాంటి ప్రమాదకర విషపదార్థాలు ఉంటాయని అధికారులు తెలిపారు. కొద్ది మొత్తంలో తీసుకున్నా లివర్ డ్యామేజీ అవుతుందని, ప్రాణాలకే ముప్పు అని చెప్పారు. కాబట్టి పండ్లు తినేముందు శుభ్రంగా కడగటం ఎంతో ముఖ్యం#