పొన్నూరు తహశీల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడీల ధర్నా
పొన్నూరులోని తహశీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాలను అంగన్వాడీలకు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో CITU నేత లక్ష్మీనారాయణ, అంగన్వాడీల అధ్యక్షురాలు సుకన్య, అంగన్వాడీలు పాల్గొన్నారు.
#🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్