తెలంగాణ : నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలోని హున్సా గ్రామంలో హోలీ పండుగ రోజున పిడిగుద్దులాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా మంగళవారం పిడిగుద్దులాట నిర్వహించారు. గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి కొన్ని నిమిషాల పాటు పరస్పరం ముఖాలపై పిడిగుద్దులు కురిపించుకుంటారు. ఈ ఆటను చూసేందుకు మహారాష్ట్ర నుంచి కూడా ప్రజలు తరలివస్తారు. బయటివారికి వింతగా కనిపించినా హున్సా గ్రామస్తులు మాత్రం దీనిని ఆచారంగా భావించి ఎంతో ఇష్టంతో ఆడుతారు. #tre-ter-tre-trendingvideo