అంబటి రాంబాబు గారు వాడిన భాష సభ్య సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించదు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా దూషించడం, అంతేకాకుండా వారి తల్లిని అవమానించడం అత్యంత ఖండనీయమైన చర్య.
రాజకీయాలలో వాదనలు, విమర్శలు సహజం. కానీ అవి వ్యక్తిగత దూషణల స్థాయికి దిగజారకూడదు. ప్రజలు నాయకుల నుంచి విలువలతో కూడిన రాజకీయాలను ఆశిస్తున్నారు.
ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో అసహనం పెంచుతాయి. అందువల్ల బాధ్యత గల నాయకులు తమ మాటల్లో సంయమనం పాటించి, గౌరవప్రదమైన రాజకీయ సంస్కృతిని కాపాడాలి.. రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు శ్రీమతి శ్రీ దగ్గుపాటి పురందేశ్వరి గారు..🙏 #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్డేట్స్📢