ShareChat
click to see wallet page

☀️☀️☀️ • తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అంశంలో తమ దర్యాప్తు వివరాలతో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపిన సుప్రీం కోర్టు నియమించిన విచారణ సంస్థ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం • 2019-24 మధ్య కాలంలో కల్తీ నెయ్యి విషయంలో జరిగిన ఘోర తప్పిదాలను, నిబంధనలకు విరుద్దంగా తీసుకున్ననిర్ణయాలను, ఉద్దేశ్యపూర్వకంగా మోసాలను వివరిస్తూ 11 పేజీల లేఖ రాసిన సిట్ • దర్యాప్తులో తేలిన అంశాలను వివరిస్తూ....బాధ్యులపై చర్యలకు సిఫారసు చేస్తూ లేఖ రాసిన సిట్ • టీటీడీ పర్చేజ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా చెవిరెడ్డి, భూమన పాత్రను నిర్థిష్టంగా ప్రస్తావించిన సిట్ • టెండర్ కండిషన్ల మొదలుకొని, నెయ్యి సరఫరా వరకు ప్రతి అంశంలో జరిగిన ఉల్లంఘనలను వివరిస్తూ నివేదిక • సిట్ రిపోర్టులోని ఇతర వివరాలు ఇలా ఉన్నాయి... • 2020లో ఎటువంటి అధ్యయనం, శాస్త్రీయత లేకుండా టెండర్ కండిషన్లు మార్చారు • టెండర్ కండిషన్లు రిలాక్స్ చేయడంతో అర్హత లేని కంపెనీలకు టెండర్ లో పాల్గొనే అవకాశం ఇచ్చారు • 2020-2023 ఈ అర్హత లేని కంపెనీలే కల్తీనెయ్యి సరఫరా చేశాయి. • నెయ్యి సరఫరా చేసే కంపెనీలు కనీసం రూ. 250 కోట్లు టర్నోవర్ ఉండాలన్న నిబంధలను రూ.150 కోట్లకు తగ్గించారు. • సరఫరా సంస్థ కనీసం 3 ఏళ్ల డైరీ రంగ అనుభవం ఉండాలన్న నిబంధనను ఏడాదికి తగ్గించారు. • కనీసం రోజుకు 4 లక్షల లీటర్ల పాలు సేకరించాలి అంటే దాన్ని పూర్తి తొలగించారు....అలాగే రూ.12 టన్నుల వెన్నను వెలికి తీయాల్సి ఉండగా దాన్ని 8 టన్నులకు కుదించారు. • అర్హత లేని డెయిరీల నుంచి కల్తీ నెయ్యి కొనుగోలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు • ఈ మొత్తం ప్రక్రియ తప్పుదారి పట్టడంలో FA&CAO బాలాజీ, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యులు • కల్తీ నెయ్యిపై పెద్ద ఎత్తున వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో 2022 మే 25వ తేదీన CENTRAL FOOD TECHNOLOGICAL RESEARCH INSTITUTE (CFTRI) కల్తీ నెయ్యిపై శాంపిల్స్ ను పరీక్షకు పంపారు. • ఈ పరీక్షలో వైష్ణవి డైరీ, బోలేబాబా డైరీల నుంచి వచ్చిన నెయ్యి కల్తీ అయ్యిందని నివేదిక వచ్చింది. • అయితే ఈ నివేదికను అడిషనల్ ఈవో ధర్మారెడ్డి సహా ఇతర అధికారులు ఆ నివేదికను పరిగణలోకి తీసుకోలేదు😡 • వరుస తప్పిదాలు, మోసాలతో కల్తీ నెయ్యి సరఫరాకు అనేక దశల్లో టీటీడీ పెద్దలు సహకరించారు😡 • ఈ నివేదిక ఆధారంగా ఎపి ప్రభుత్వం టీటీడీ ఈవో గా ఉన్న అశోక్ సింఘాల్ ను బదిలీ చేసింది👍 • ఈ విషయంలో తరుపరి చర్యల కోసం ప్రత్యేకంగా సమావేశమై చర్చించిన ఎపి క్యాబినెట్.....ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ వేయాలని తీర్మానం చేసింది. #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰జాతీయం/అంతర్జాతీయం

563 వీక్షించారు