ShareChat
click to see wallet page

సంగారెడ్డి జిల్లాలో తేనెటీగల బీభత్సం… సదాశివపేట మండలం వెంకటాపురం గ్రామంలో ప్రజలపై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో గ్రామంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనలో పలువురు గ్రామస్థులు తీవ్రంగా గాయపడగా, సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న అంబులెన్స్ గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించింది. అయితే గాయపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో అంబులెన్స్ సరిపోక, మరికొందరు బాధితులు సొంత వాహనాల్లో ఆసుపత్రికి వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోంది. 👉 మరిన్ని తాజా వార్తల కోసం RAJH NEWS YouTube Channel ను Follow – Like – Share – Subscribe చేయండి. #RAJHNews #BreakingNews #TeluguNews #Sangareddy #TelanganaNews #BeeAttack #LatestNews ##RAJHన్యూస్

216.5K వీక్షించారు
1 నెలల క్రితం