పులివెందుల పుణ్యకార్యంలో జగనన్న వెరైటీ తింగరి చేష్టలు!
కొండ మీద చేసిన పాపాల పుట్ట పగిలి, హిందూ భక్తుల మనోభావాలు గాల్లో కలిశాక.. డ్యామేజ్ కంట్రోల్ కోసం మన "పులివెందుల పుంగవుడు" ఒక కార్యక్రమం సెట్ చేశాడు. కానీ అక్కడ కూడా తన మార్కు 'తింగరి చేష్టల'తో అభాసుపాలవ్వడం మన జగనన్నకే చెల్లింది.
పూజా సమయంలో పండితులు చేతికి అక్షింతలు ఇచ్చి, చాలా సమయం ఏమి చెయ్యాలో వివరించారు. వాటిని భక్తితో తల మీద చల్లుకోవడం లేదా కళ్ళకు అద్దుకోవడం లోకరీతి. వెనక వైపుగా మెల్లగా పెట్టాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్! అక్షింతలను అందుకుని, ఏదో కొత్త రకం సెంటు వాసన చూస్తున్నట్టు ముక్కు దగ్గర పెట్టుకుని, ఆ తర్వాత నిర్లక్ష్యంగా ఎడమవైపు వెనక్కి విసిరేశాడు.
శాస్త్రం ఏం చెబుతోంది? (జగనన్నకు తెలియనిది):
అక్షింతలను తల వెనక్కి వేయడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక పరమార్థం చాలా గొప్పది:
"భగవంతుడి ఆశీర్వాదం నా శిరస్సుపై ఉంది, నా అహంకారం మరియు పాపాలు నా వెనకాల పడిపోవాలి" అనే భావన అది. అహంకారాన్ని వీడి, శుభప్రదమైన వాటిని గౌరవంగా స్వీకరించడం దీని సంకేతం.
కానీ మన వాడికి అటు భక్తి లేదు, ఇటు విజ్ఞత అసలే లేదు! అక్షింతలను అలా విసిరేయడం చూస్తుంటే, ఆశీర్వాదాన్ని స్వీకరించడం కంటే.. పక్కనే ఉన్న అవినాష్ రెడ్డి మొఖాన కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. పవిత్రమైన పూజలో కూడా ఈ "వయ్యారాలు", "వెటకారాలు" అవసరమా జగన్? #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు