ఏపీ అసెంబ్లీకి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి కృతజ్ఞతలు
- మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ గారు మరణించిన నేపథ్యంలో శాసన సభలో సంతాప తీర్మానం ప్రవేశ పెట్టిన స్పీకర్..
- నిబద్ధత ఉన్న నేతగా ఆయన చిర స్థాయిలో నిలిచి ఉంటారని నివాళి
- సంతాప తీర్మాన పత్రం చదివి వినిపించిన స్పీకర్..
- దివంగత నేతకు అశ్రునివాళులు..ఉత్తరాంధ్ర మరో దిగ్గజ నేతను కోల్పోయిందని దిగ్భ్రాంతి
అరసవల్లి, శ్రీకాకుళం నగరం : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని..దివంగత నేత, మాజీ మంత్రివర్యులు గుండ అప్పల సూర్యనారాయణ గారికి సంతాపం తెలుపుతూ.. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా తన భర్తను స్మరించుకున్న ఏపీ అసెంబ్లీ సభ్యులకు, సభాపతికీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి
మాజీ శాసన సభ్యురాలు గుండ లక్ష్మీదేవి గారు కృతజ్ఞతలు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. సుదీర్ఘ ప్రజా ప్రస్థానం సాగించిన నేతకు గౌరవ సూచకంగా ఓ బడుగుల నేతను స్మరిస్తూ..తెలుగు దేశం అధినేత నేతృత్వాన ఉన్న కూటమి ప్రభుత్వం సభా సంప్రదాయాలను పాటిస్తూ..
గుండ అప్పల సూర్యనారాయణ గారి సేవలను తలుచుకోవడంతో ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయనతో ఉన్న అనుబంధాన్నీ గుర్తు చేసుకుని కన్నీటి నివాళులు అర్పించిన సభ్యులందరికీ పేరుపేరునా తన కృతజ్ఞతాంజలులు తెలిపారు. ప్రజా జీవితాన నీతి నిజాయితీలే ముఖ్యమని, వ్యవస్థలలో నిబంధనల పాటింపే ప్రాముఖ్య రీతికి సంకేతం అని తుది శ్వాస వరకూ నమ్మి పాటించిన వ్యక్తి అప్పల సూర్యనారాయణ గారని సభ్యులు కీర్తించడం, మరోసారి ఆ..మహానేతను గౌరవించుకోవడం తనను మరింత భావోద్వేగానికి గురిచేసిందని చెబుతూ..తన ప్రకటన ముగించారు. #telugudesamparty