🕉ఓం నమః శివాయ🔱
Day 7 Of Sadhana🧘♂️
ప్రమథ గణాలంటే ఎవరు?
ప్రమథ గణాలంటే శివపరివారం లేదా శివుని సేన లేదా అనుచరులు. ప్రమథ అంటే బాగా మథించగలిగే వారని అర్థం. వీరు దేవతలను కూడా శిక్షించ గలవారు. వీరు అన్నిచోట్లా వ్యాపించి ఉండే రుద్రశక్తులు. ప్రమధ గణాలు కోట్లకొలది ఉంటారు. మహాభక్తులై శివలోకానికి చేరే జీవులు కూడా శాశ్వత శివ సాయుజ్యం పొంది రుద్రగణాలుగా ఉండి పోతారని ప్రతీతి. అయితే వారికి నాయకులు లేదా గణాధిపతులు కూడా ఉంటారు.శివుడు గణేశుడిని గణాలకు నాయకుడిగా నియమించాడు, అందుకే ఆయనను "గణపతి" అని కూడా పిలుస్తారు. వీరు హిమాలయాలలో ఉన్న కైలాస పర్వతంపై నివసిస్తారు.
ప్రమథ గణాలలో ముఖ్యులు ఎవరు.?
1) వీరభద్రుడు: సాక్షాత్ శివస్వరుపం అందరికన్నా ముఖ్యమైన గణాధిపతి. 2)ఆది వృషభం: ధర్మదేవత. శివున్ని మోయ గలిగే వరం పొంది, అతని సమీపం లో ఎప్పుడు సంచరించే తెల్లని వృషభ మూర్తి.3) నందీశ్వరుడు: శివునికి ఆంతరంగికునిగా ఉండే గణమూర్తి. కైలాసానికి ఎవరు వచ్చినా ఇతని అనుమతి పొందితేనే శివదర్శనం! 4) స్కందుడు:కుమారస్వామి దేవసేనాధిపతి,బ్రహ్మజ్ఞాని,శివకుమారుడు.5)కాలభైరవుడు: బ్రహ్మ ఐదవ తలను తీసేసిన రుద్రుడు. కాల హస్తుడు. కాశీ పురాధీశుడు 6)చండీశుడు: ఒక గోప బాలుడు.శివ నింద చేసేవారికి అతడు చండశాసనుడు.ఇలా శివగణాలలో ఎన్నో రకాల వారు ఉంటారని బసవ పురాణం వివరిస్తుంది.
# #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🔱శక్తీ సాధన🙏 #📙ఆధ్యాత్మిక మాటలు #🆕షేర్చాట్ అప్డేట్స్ #✌️నేటి నా స్టేటస్