స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జనసేన నాయకులు కిషోర్ గునుకుల- నెల్లూరు నగరంలోని మలాపేట శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తి భావాలను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జల్సా నాయుడు, కిషోర్ గునుకుల పాల్గొని విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు మరియు సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. దేశ ప్రగతిలో యువత పాత్ర కీలకమని, విద్యతో పాటు దేశభక్తి, సామాజిక బాధ్యత, సేవా భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ, వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై హింద్ 🇮🇳 జై జనసేన! #KishoreGunukula #JanaSena #IndependenceDay #JanaSenaParty #trendingreels #independencedayindia #HarGharTiranga t #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ##janasena ##pawankalyan

17K views • 18 hours ago
00:00
00:43

#⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

993 views • 15 hours ago
00:00
01:04