YS Jagan Mohan Reddy గారు మీరు పొగాకు రైతులకు లక్ష రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చామని చెబుతున్నారు. మీ ఎదురుగా ఉన్న రైతు ఇవ్వలేదు అంటున్నారు.
పొగాకు రైతులను సంక్షోభం చుట్టుముట్టిన ప్రతిసారి ఆదుకున్నది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే. ప్రస్తుత సంవత్సరం టొబాకో బోర్డు లక్ష్యం 131 మిలియన్ కిలోలు కాగా, రైతులు సుమారు 241 మిలియన్ కిలోలు ఉత్పత్తి చేశారు. అయినప్పటికీ సుమారు 100 మిలియన్ కిలోల పొగాకుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కిలోకు రూ.10 చొప్పున మొత్తం రూ.100 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది.
ఈ సహాయం పంపిణీని రేపటి నుంచే ప్రారంభిస్తున్నాం.
సుమారు రూ.280 కోట్లు వెచ్చించి గతేడాది బర్లీ పొగాకు రైతుల నుంచి 25 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేశాం.
2014–15లో ఎఫ్సీవీ పొగాకు ధరలు పడిపోయినప్పుడు, ప్రతి కిలోకు రూ.20 ఆర్థికసాయం అందించాం.
2019లో కిలో పొగాకు రూ.121కి పడిపోతే సగానికి పైగా రైతుల నుంచి పొగాకు కొనకుండా వదిలేసింది మీ ప్రభుత్వమే జగన్ రెడ్డి గారు.
2020లోనూ ధర కిలోకు రూ.123కు పడిపోయినప్పటికీ, మీ ప్రభుత్వం ఒక్క కిలో కూడా కొనుగోలు చేయలేదు..
#PsychoFekuJagan #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
704 views•9 hours ago
00:00
00:06
#☝ मेरे विचार #❤️जीवन की सीख #👍 डर के आगे जीत👌 #🌸पॉजिटिव मंत्र #👌 आत्मविश्वास