#🕯️సీనియర్ పార్టీ నాయకుడు కన్నుమూత..రాజకీయాల్లో ఓ అధ్యాయానికి ముగింపు ఉద్యమమే ఊపిరిగా జీవించిన అవిశ్రాంత యోధుడు మాజీ మంత్రి ముద్రగడ్డ పద్మనాభం గారు ఇకలేరు! లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఓక సామజిక వర్గం ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీకగా,ఓ ప్రతిబింబంలా నిలిచిన ముద్రగడ్డ దిగికేగడం కాపు సామాజిక వర్గానికి తీరనిలోటు! వైస్సార్సీపీ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కాపు ఉద్యమకారుడు,ఓ అవిశ్రాంత యోధుడు, తన జీవితాంతం ప్రజా సమస్యలు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం హక్కుల అంశంపైనే దృష్టి సారించి, ఎప్పుడు ఆ లక్ష్యం వీడని,దృష్టి మరల్చని ఓ గొప్ప పోరాటపటిమ గల ఓ నీఖార్సైనా, నైతిక విలువలు మెండుగా గల ఓ అరుదైన నాయకుడు అయిన ముద్రగడ్డ పద్మనాభం గారి మరణం ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ రంగానికి అటు కాపు సామాజిక వర్గానికి ఓ తీరని లోటు.అంతేకాదు ఆ మహానాయకుడు ముద్రగడ్డ శాశ్వత నిష్క్రమణతో రాజకీయాల్లో ఓక శకం ముగిసిపోయింది అని మనం నిస్సందేహంగా చెప్పవచ్చు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఓక సామాజిక వర్గం ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీకగా మారిన ఓ విశిష్ట వ్యక్తి,తన అమూల్యమైన సుదీర్ఘ రాజకీయ జీవితంలో విజయాలు,పరాజయాలు,వివాదాలు,విమర్శలు ఇలా అన్నింటిని అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఆయన సాగించిన రాజకీయ ప్రయాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఓక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ముద్రగడ్డ గారి రాజకీయ ప్రస్థానం, ఆయన రాజకీయంగా ఎదిగిన తీరుతెన్నులు,ఆయన అధిరోహించిన ఉన్నత పదవుల విషయానికి వస్తే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా,ఒకసారి ఎంపీగా,గెలవడమే కాదు,రెండు సార్లు మంత్రిగా సైతం పనిచేసిన ఓ గొప్ప చరిత్ర ఈ ముద్రగడ్డ పద్మనాభం గారిది. ఇక 1979లో ప్రత్తిపాడు నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి, 1983,85 ఎన్నికల్లోను ఎమ్మెల్యేగా గెలవడమే కాదు ఎక్సెజ్,రవాణా శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.ఆ సమయంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో తాటాకు గుడిసె లేని నియోజకవర్గంగా అర్హులందరికీ 3 సెంట్లతో గృహ నిర్మాణాలు ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలిపిన ఓ అంకితభావం,దృఢ దీక్ష మెండుగా గల ఓ ఆదర్శ, స్ఫూర్తిదాయక నాయకుడు ఈ ముద్రగడ్డ పద్మనాభంఇంకా చెప్పుకుంటూ పోతే 1989లో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో పౌర సరఫరాలు,చేనేత జోళి శాఖ పరిశ్రమల మంత్రిగా పనిచేశారు.1999 లో కాకినాడ నుంచి ఎంపీగా గెలిచారు ఈ కాకలుతీరిన రాజకీయ నాయకుడు ఈ ముద్రగడ్డ పద్ననాభం గారు. అన్నింటికి మించి ముద్రగడ్డ పద్మనాభం గారు విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారు,పదవుల కన్నా ప్రజలనే గొప్పగా భావించడమే కాదు,మాటకు కట్టుబడి నిలబడే తత్వం,మంచి కోసం ఎంతదూరమైనా వెళ్లే దైర్యం ఆయన సొంతం. ఏదిఏమైన ఆత్మ గౌరవానికి,నీతి నిజాయితీకి, ఉన్నత వ్యక్తిత్వానికి నిలువెత్తు రూపం అయిన ముద్రగడ్డ పద్మనాభం గారి మరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైస్సార్సీపీ పార్టీకి,ఆయనను అభిమానించే లక్షలాదిమందికి ఓ తీరని లోటు అనే మాట అక్షర సత్యం.అదేమాదిరి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన 2024 మార్చి 15 న మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు,వైస్సార్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి గారి సారథ్యంలో వైస్సార్సీపీ పార్టీ తీర్థం పుచ్చుకొని,వైస్సార్సీపీ పార్టీ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా అత్యంత ఉన్నతంగా సేవలు అందించారు ఈ ముద్రగడ్డ పద్మనాభం గారు.నిష్పక్షపాత వైఖరి,ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతలు అర్జీంచడమే కాదు,సూటిగా మాట్లాడటం,అనుకున్నది నిర్మొహమాటంగా చెప్పడం ముద్రగడ్డ గారి ఓ ప్రత్యేకతగా చెప్పవచ్చు.ఏమైనా అతిథి దేవోభవ అనే పర్యాయ పదానికి ఓ ప్రతిరూపంగా,ప్రబల నిదర్శంగా నిలువడంలో ముద్రగడ్డకు సాటిరారు మరొకరు అనేలా తనకంటూ ఓ ప్రత్యేకత,గుర్తింపు తెచ్చుకున్న ఈయన గారు తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ అల్పాహారం అయిన,భోజనం అయిన చేసి వెళ్లాల్సిందే. అంతేకాదు అల్పాహారంలోనూ, భోజనంలోను చాలా ప్రత్యేకతలు ఉండేలా ఆయన చొరవ చూపడమే కాదు ఎంత మంది వచ్చిన అందరూ తిని వెళ్లేవరకు ఆయనే స్వయంగా దగ్గరుండి అందరిని తిన్నారా? లేదా? అంటూ ఎంతో ఆప్యాయంగా వాకబు చేసే గొప్ప మనస్సున్న మనిషి ఈ ముద్రగడ్డ పద్మనాభం గారు అనే మాట అక్షర సత్యం. అందుకే ఆయన జీవించినన్నిరోజులు ప్రతి నిత్యం వారి ఇంట్లో పదుల సంఖ్యలో భోజనాలు చేయాల్సిందే. అన్నింటికిమించి ఈ ప్రత్యేక విషాద సమయాన ఆ మహానాయకుడు,ప్రజల మనిషి అయిన ముద్రగడ్డ పద్మనాభం గారి పవిత్ర ఆత్మకు దివిలో ఎనలేని శాంతి చేకూరాలని మనమంతా మనసా,వాచ,కర్మణ హృదయపూర్వకంగా కోరుకుందాం.ఓం శాంతి 🙏🙏🙏 - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా!

1K views • 8 hours ago
00:00
00:59

#❤️सैड व्हाट्सएप स्टेटस #😍स्टेटस की दुनिया🌍 #😃 शानदार स्टेटस

1M views • 10 days ago
00:00
01:40