ShareChat
click to see wallet page

రామాయణం గురించి ప్రకాశ్‌రాజ్ ఏమన్నారు? ✍️✍️ నెల క్రితం కేరళ సాహిత్యోత్సవం(Kerala Litetary Festival)లో నటుడు ప్రకాశ్‌రాజ్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆయన రామాయణాన్ని అవమానించారని, రామలక్ష్మణులను కూలీలుగా వర్ణించారని ఆయన మీద ఫిర్యాదు చేస్తున్నారు. అసలా సమావేశంలో ఆయన ఏం మాట్లాడరనేది ఇక్కడ రాస్తున్నాను. *** విద్యలో నాటకరంగాన్ని ఓ సాధనంగా మారుస్తూ, రెండేళ్లుగా నేనో ఇంక్యుబేటర్ నడుపుతున్నాను. అందులోని పిల్లలు ఒక చక్కటి నాటకం వేశారు. అందులో వాళ్లు ‘రామాయణం’ను తిరగరాశారు. దాని కథ ఇలా సాగుతుంది. ఒక చీమలపుట్ట ఉంది. ఒక కార్యక్రమం కారణంగా భారీ పాలవర్షం కురవబోతోందని అందులోని చీమలకు తెలిసింది. వెంటనే అక్కడి నుంచి తప్పించుకోవడానికి బయటకు వచ్చాయి. ఆ చీమలు నడుస్తున్నాయి. మనుషులు మొత్తం భూమిని విషతుల్యం చేశారని అర్థం చేసుకున్నాయి. అందులో ఓ పెద్ద చీమ తోటివారిని చూసి ‘మనుషులు విషతుల్యం చేయని ఒకే ఒక వస్తువు పుస్తకాలు. పదండి గ్రంథాలయానికి వెళదాం’ అంది. అక్కడికి వెళ్లాక మిగిలిన చీమలతో ‘ఈ పుస్తకాల్లో మీరు ఎంత జీర్ణం చేసుకుంటే అంత మీరు తినొచ్చు. కానీ ఎక్కువగా తింటే ఆ పుస్తకాల్లోని పాత్రలుగా మీరు మారిపోతారు’. చీమలు సరేనని వెళ్లాయి. కొన్ని చీమలు మితిమీరి రామయణాన్ని తిన్నాయి. వెంటనే అవి రాముడు, లక్ష్మణుడు, సీత, రావణుడు, శూర్పణఖగా మారిపోయాయి. రామ, లక్ష్మణులు ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చారు. లక్ష్మణుడు రాముడితో ‘రామా! మనమెంత అదృష్టవంతులం. అక్కడ ఓ అడవి ఉంది’ అన్నాడు. దానికి రాముడు ‘కాదు..అది ఎవరిదో తోట’ అని చెప్పాడు. ‘ఓహ్..అక్కడ పళ్లున్నాయి. వాటిని తినొచ్చా?’ అన్నాడు లక్ష్మణుడు. ‘తినొచ్చు..’ అన్నాడు రాముడు. ‘అది దొంగతనం అవ్వదా?’ అని అడిగాడు లక్ష్మణుడు. ‘లేదు. మనం ఆకలితో ఉంటే వాటిని తినొచ్చు. అది దొంగతనం అవ్వదు’ అన్నాడు రాముడు. ఇద్దరూ వెళ్లి పళ్లు కోసుకుని తింటున్నారు. అదే సమయంలో రావణుడు, శూర్ఫణఖ అక్కడి వచ్చారు. ‘అన్నా! ఎవరో మన తోటలో పళ్లు తింటున్నారు’ అంది శూర్ఫణఖ ‘వాళ్లు ఆకలితో ఉన్నారు. ముందు వాళ్లని తినని. ఆ తర్వాత మాట్లాడదాం’ అన్నాడు రావణుడు. రాముడు, లక్ష్మణుడు పళ్లు తినడం అవ్వగానే శూర్పణఖ, రావణుడు అక్కడికి వచ్చారు. రాముడు వాళ్లని చూసి ‘లక్ష్మణా! ఎవరో గిరిజనులు వచ్చారు’ అన్నాడు. ‘మేం ఈ తోటకు యజమానులం’ అన్నాడు రావణుడు. రాముడు ఆశ్చర్యంగా చూశాడు. ‘మీరు ఇక్కడ పళ్లు తిన్నారు కాబట్టి డబ్బు కట్టాలి’ అని అడిగాడు రావణుడు. వాళ్లు తిన్న పళ్లు లెక్కలేసి, దానికి జీఎస్టీ యాడ్ చేసి ఎంత కట్టాలో శూర్ఫణఖ చెప్పింది. 'అంత డబ్బు మా దగ్గర లేదు' అన్నారు రామలక్ష్మణులు. సరే అని శూర్పణఖ వారికి 20 శాతం డిస్కౌంట్ ఇచ్చింది. 'అయినా కట్టలేం' అన్నారు వాళ్లు. 'డిస్కౌంట్ ఇచ్చినా సరే మీరు డబ్బు కట్టలేకపోతున్నారంటే, మీరు పర్యాటకులు కారు. మీరు తిండి కోసం ఇక్కడికి వచ్చారు. కాబట్టి మీరు తిన్న పళ్ల విత్తనాలు ఇక్కడ నాటి, వాటిని చెట్లుగా మార్చి వెళ్లండి' అని రావణుడు అన్నాడు. చిన్నారులు ఈ రామాయణంలో పాలిటిక్స్ మాట్లాడారు. మీరు ఇక్కడి వస్తే మీ హిందీ మా మీద రుద్దకండి. కావాలంటే మా భాష నేర్చుకోండి. పని చేయడానికి ఇక్కడికి వచ్చినవారు మా భాష నేర్చుకోవాలి కానీ, వాళ్ల భాషను మా మీద రుద్దడం ఏమిటి? ఒకే దేశం..ఒకే మతం..అనేది మా డైలాగ్ అనడం ఏమిటి? ఇది మా భూమి. ఇక్కడ నీకేం పని? గెట్ లాస్ట్. నాటకం ద్వారా నేను చెప్పాలనుకుంటున్న కల్చరల్ పాలిటిక్స్ ఇవి. #🇮🇳 మన దేశ సంస్కృతి #😃మంచి మాటలు

586 వీక్షించారు
4 రోజుల క్రితం