చంద్రబాబు నాయుడు గారికి రైతుల పక్షాన కొన్ని ప్రశ్నలు... చంద్రబాబు నాయుడు గారూ... రైతులంటే మీకు మొదటి నుంచీ ఎందుకింత నిర్లక్ష్యం? ఈరోజు గోదావరిలో వరదనీరు సముద్రంలో వృథాగా కలుస్తుంటే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పంట పొలాలు సాగునీరు లేక ఎండిపోతున్నాయి. నీటిపారుదల శాఖ ప్రజా ప్రచారం కంటే రైతులకు నీరు అందించడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే "కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలి" అని వ్యాఖ్యానించిన మీరు, రైతుల సంక్షేమాన్ని ఎలా అర్థం చేసుకున్నారో ప్రజలకు తెలుసు. అదే సమయంలో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ అందించి రైతు పక్షపాతిగా నిలిచారు. బషీరాబాద్ రైతుల ఉద్యమాన్ని కూడా ప్రజలు మర్చిపోలేదు. రైతులపై లాఠీచార్జ్ ఎందుకు జరిగింది? గుర్రపు దళాన్ని ఎందుకు ప్రయోగించారు? పరిస్థితి కాల్పుల వరకు ఎందుకు వెళ్లింది? ఆ ఘటనల్లో జరిగిన ప్రాణనష్టానికి బాధ్యత ఎవరిది? ఈరోజు కూడా రైతు భరోసా కోసం, సాగునీటి కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా ప్రచార రాజకీయాలు పక్కన పెట్టి, రైతులకు నీరు, పెట్టుబడి సహాయం అందించి వారి కష్టాలను తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. #రైతు

577 views • 1 days ago
00:00
00:44

#📖Whatsapp शायरी #💓 मोहब्बत दिल से #❤️Love You ज़िंदगी ❤️ #❤️प्यार वाले स्टेटस ❤️ #😉 और बताओ

349K views • 17 days ago
00:00
00:07