#🫨భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ!ఫిలిప్పీన్స్లో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైంది. భూకంప ప్రభావంతో జనరల్ శాంటోస్ నగరం తీవ్రంగా వణికిపోయింది. ప్రకంపనలు రాగానే ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని భవనాలు కుప్పకూలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జనరల్ శాంటోస్కు నైరుతి దిశగా 8 మైళ్ల దూరంలో, 6.2 మైళ్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఫిలిప్పీన్స్లో 10 అడుగుల ఎత్తున సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఇండోనేషియా, మలేషియాలో కూడా 3 అడుగుల ఎత్తు వరకు సముద్రపు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ సెంటర్ వెల్లడించింది. ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. నేలరాలిన బిల్డింగ్స్