ShareChat
click to see wallet page

ప్రతిభకు ప్రోత్సాహం -ప్రగతికి ఉత్సాహం పేరుతో పులివెందులలో కాంబల్లి గ్రామ మాజీ సర్పంచ్ శ్రీమతి భూమిరెడ్డి  ఉమాదేవి ఆధ్వర్యంలో పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన పిల్లలకు ఘన సన్మానం చేయడం అభినందనీయం. 54 పాఠశాలలకు చెందిన 162 మంది  విద్యార్థులకు మెమెంటో, శాలువాతో సన్మానించి 7 లక్షల రూపాయల నగదు బహుమతులు అందించి గొప్ప ప్రోత్సాహం ఇచ్చారు. ఈ సందర్భంగా పిల్లలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన విందు సరికొత్త సంప్రదాయానికి నాంది పలికింది. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారితోపాటు ప్రతిభను ప్రోత్సహించిన అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. #APstudentsShineBright #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

515 ने देखा
7 घंटे पहले