కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త.. జూలై 26న నూతన రైల్వే స్టేషన్ ప్రారంభం | Nyalkal24News
సిద్ధిపేట జూలై 26న నూతన కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం కానుంది. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు.
ఈ రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడంతో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లక్షలాది మంది మల్లన్న భక్తులకు ప్రయాణం మరింత సులభం కానుంది. ప్రయాణ సమయం, ఖర్చు తగ్గడంతో పాటు కొమురవెల్లి ప్రాంత అభివృద్ధికి కూడా ఇది దోహదం చేయనుంది.
జూలై 26 నుంచి భక్తులకు కొత్త రైల్వే సౌకర్యం..!
#న్యూస్ #Nyalkal24News
668 views•1 days ago
00:00
01:14
సెల్ ఫోన్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు | Nyalkal24News
ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గూడెం గ్రామానికి చెందిన విద్యార్థి నికాడ లోకేష్ ఇంట్లో సెల్ ఫోన్ వాడుతుండగా అది ఒక్కసారిగా పేలిపోయింది.
ఈ ప్రమాదంలో లోకేష్ ముఖ భాగానికి తీవ్ర గాయాలు కాగా, కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.
ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొంది. చార్జింగ్లో ఉన్న సెల్ఫోన్ను ఉపయోగించకుండా ఉండాలని, నాణ్యమైన చార్జర్లు, బ్యాటరీలను మాత్రమే వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. సెల్ ఫోన్ వినియోగంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి భద్రతా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
#న్యూస్ #Nyalkal24News