పెళ్లీడుకు వచ్చిన పిల్లలందరికీ ఒకేసారి పెళ్లి!
ఉత్తరాఖండ్లోని జౌన్సార్ బావర్ ప్రాంతంలో ఖర్చు భారం తగ్గించే ఓ వింత వివాహ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. అక్కడ ఉమ్మడి కుటుంబంలో పెళ్లీడుకు వచ్చిన పిల్లలు ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే అందరికీ ఒకేసారి పెళ్లి చేస్తారు. తాజాగా దౌలత్ సింగ్ కుటుంబంలోని ఐదుగురు అబ్బాయిలు, ఓ అమ్మాయికి 'జోజోడా' పద్ధతిలో ఒకే వేదికపై పెళ్లి చేసి వార్తల్లో నిలిచారు. ఈ సంప్రదాయం ప్రకారం వధువులే ఊరేగింపుతో వరుడి ఇంటికి వస్తారు. #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్