ShareChat
click to see wallet page

ఖరీఫ్ కి శుభారంభం..'ముందస్తు జలాల విడుదలతో గోదావరి రైతుల్లో ఆనందం'ధవళేశ్వరంలోని సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజ్ వద్ద ఖరీఫ్ పంట సాగు కోసం, గోదావరి డెల్టా పరిధిలోని 3 జిల్లాల్లో ఉన్న సుమారు 2,81,303 ఎకరాల ఆయకట్టుకు, సాగునీటి విడుదల కార్యక్రమంలో పాల్గొని నీటిని విడుదల చేయటం జరిగింది. ఇది గోదావరి డెల్టా రైతు సోదరుల్లో కొత్త ఆశలను, కొత్త ఉత్సాహాన్ని అందించే కీలక సందర్భం.రైతులకు సాగునీరు సకాలంలో అందించాలనే సీఎం చంద్రబాబుగారి ఆదేశాల మేరకు ఈ ఏడాది కూడా ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందుగానే కాలువల్లో నీటిని విడుదల చేయడం జరిగింది.అయితే కేవలం నీళ్లు వదలడమే కాకుండా.. ఈ డెల్టా పరిధిలో రూ.12.19 కోట్ల వ్యయంతో కాలువల పూడికతీత, షట్టర్ల మరమ్మతులు లాంటి 195 పనులను ముందే పూర్తి చేసి, రైతన్నకు ఇబ్బంది రాకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవటం జరిగింది.మన కూటమి ప్రభుత్వంమాటల్లో కాదు.. చేతల్లో చేసి చూపించే"రైతు పక్షపాత ప్రభుత్వం"అని చెప్పేందుకు ఎంతో గర్వపడుతున్నాను.ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ గారు, అమలాపురం ఎంపీ హరీష్ గారు, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం గారు, అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి గారు, గోదావరి ఈస్టర్న్ డెల్టా చైర్మన్ సునీల్ గారు, వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి గారు పాల్గొన్నారు. #🟡తెలుగుదేశం పార్టీ

1.5K ने देखा
10 घंटे पहले