గాజువాకలో భక్తజన సందోహం.. ఘనంగా ముగిసిన శ్రీ కుంచమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు
గాజువాక గ్రామ దేవత శ్రీ కుంచమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. జాతర సందర్భంగా గాజువాక భక్తజన సందోహంతో కిటకిటలాడింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జాతర ఉత్సవాల్లో భాగంగా కమిటీ నిర్వాహకులు ప్రత్యేకంగా 15 స్టేజీలను ఏర్పాటు చేసి భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. వివిధ కళాప్రదర్శనలు, భక్తి గీతాలు, హారతులతో ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. #news