కిరాణా షాపులో పల్లీలు కొనుక్కొని తిన్న ప్రధాని
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ పశ్చిమ బెంగాల్లో లో పర్యటించిన ప్రధాని మోదీ స్థానిక ప్రజలకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఝామ్లో ర్యాలీ చేసిన ఆయన తన కాన్వాయ్ మధ్యలో ఆపేసి ఓ కిరాణా షాపులోకి వెళ్లారు. అక్కడ పల్లీలు, చిరుతిళ్లు కొనుక్కొని తిని డబ్బులు ఇచ్చారు. షాపు యజమానితో కాసేపు ముచ్చటించారు. మోదీని చూసి అక్కడున్న వారు 'భారత్ మాతాకీ జై', 'జై శ్రీరామ్', 'మోదీజీ జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు. #🆕షేర్చాట్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు