ARIGELA TEJA VENKATESH
1.5K views
*ఫిబ్రవరి 12 వ తేదీ గురువారం 2026* *పెళ్లి వయస్సు 27 నుంచి 29కి జంప్* * సెకండ్ మ్యారెజ్ విషయంలో ఇలా..?!* భారత్ లో పెళ్లి పట్ల ప్రజల అభిప్రాయాలు మారుతున్నాయి. గత దశాబ్ద కాలంలో పెళ్లి చేసుకునే వయస్సు 27 నుంచి 29కి పెరిగింది. అదే రెండో పెళ్లి చేసుకోవాలి అనుకునేవారి సంఖ్య 43% పెరిగింది. జీవన్సాథీ మ్యాట్రీమోనీ నిర్వహించిన ఓ సర్వేలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. 2016 నుంచి 2025 మధ్య ఈ ప్లాట్ఫాంలో ఉన్న 30,000మంది యూజర్లతో ఈ సర్వే నిర్వహించారు. దీని ప్రకారం పెళ్లి ప్రాసెసను మొదలుపెట్టే వారి వయస్సు 27 నుంచి 29కి పెరిగింది. దాదాపు 50% మంది 29 ఏళ్లకు పెళ్లికి సంబంధించిన పనులు ప్రారంభిస్తున్నారు. రెండో పెళ్లి చేసుకోవాలని అనుకునేవారు 2016 లో 11% ఉన్నారు. 2025 నాటికి వారి సంఖ్య 16 శాతానికి పెరిగింది. 10 ఏళ్లలో రెండో పెళ్లి కోసం చూసేవారు దాదాపు 43% ఎక్కువయ్యారు. ఆర్థికంగా స్థిరంగా ఉండడం, మానసికంగా, వ్యక్తిగతంగా పెళ్లికి సిద్ధంగా ఉండడం, కెరీర్ గ్రోత్, రైట్ పర్సన్ వంటి అంశాల వల్ల పెళ్లి చేసుకునే ఏజ్ పెరిగిపోతోందని ఆ సర్వేలో తేలింది. అలాగే 77% మంది తమ మ్యాట్రీమోనీ ప్రొఫైల్స్ను తామే స్వయంగా మ్యానేజ్ చేసుకుంటున్నట్లు తేలింది. 8% మంది మాత్రమే భార్యాభర్తల్లో ఒకరు సంపాదిస్తే సరిపోతుందని నమ్ముతున్నారు. 15% మంది మహిళలు మాత్రమే తమకన్నా తక్కువ సంపాదించే వారైనా ఫర్వాలేదు అని అనుకుంటున్నారు. పురుషుల్లో 87% మంది తమకన్నా ఎక్కువ సంపాదించే భార్య అయినా ఫర్వాలేదన్నారు. #Konaseema #Konasema #KonaseemaTourism #AmalapuramTown #AmalapuramCity #AndhraAseels #మనఆంధ్రప్రదేశ్ #మననియోజకవర్గం #AndhraPradeshTourism #AndhraPradesh #APLegislativeCouncil #ApAssembly #IdhiManchiPrabhutvam #ChandrababuNaid #🇮🇳దేశం #🇮🇳 మన దేశ సంస్కృతి #⛳భారతీయ సంస్కృతి #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 #📽ట్రెండింగ్ వీడియోస్📱